పెద్దేముల్ : నిషేధిత గుట్కాలు, మత్తు పదార్థాలను అక్రమ రవాణ చేసిన, విక్రయించిన అలాంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకొంటామని పెద్దేముల్ ఎస్ఐ సతీష్ హెచ్చరించారు. శనివారం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. పాత తాండూరు ప్రాంతానికి చెందిన అబ్దుల్ కరీం ఖాన్ (40) అనే వ్యక్తి రూ.1,83,215 విలువ గల సుమారు 1,11,840 నిషేధిత గుట్కా ప్యాకెట్లను సంచులలో నింపుకొని (ఏపీ28డీఆర్1011)గల కారులో శనివారం తెల్లవారు జామున కర్ణాటక రాష్ట్రం కుంచారం గ్రామం నుంచి తాండూరు వైపునకు వస్తున్న క్రమంలో గాజీపూర్ గ్రామ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద టాస్క్పోర్సు పోలీసులు పట్టుకున్నారు.
కారును, నిందితుడు అబ్దుల్ కరీంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించడం జరిగించారు. అక్రమ రవాణ చేసిన గుట్కాలను ఎక్కడెక్కడ విక్రయిస్తున్నాడు? అనే కోణంలో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ మొదలు పెట్టారు.