మర్పల్లి : మండలంలోని కల్ఖోడా గ్రామాన్ని ఎన్ఆర్ఈజీఎస్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్లు మరళీధర్, నరేశ్ కుమార్ శనివారం సందర్శించి ఫారెస్ట్లో నాటిన మొక్కలను, పంట నూర్పిడి కల్లాలను, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఫారెస్ట్లో కందకాలను పరిశీలించి తక్కువ లోతు తీశారని కందకాలు తీసేటప్పుడు దగ్గరుండి తీయించాలని టీఏ, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. వర్క్పైల్స్లో రికార్డులు సక్రమంగా ఉంచేటట్లు చూడాలన్నారు. ఆర్టీకల్చర్ కల్లాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి పని వద్ద నేమ్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వారి వెంట ఏపీడీ సరళ, మండల ప్రత్యేకాధికారి లక్ష్మి, ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్, ఏపీవో అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, టీఏ ఉన్నారు.