ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 16 : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బలపరీక్షకు కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాకపోవడంతో వీగిపోయింది. ఉదయం 11 గంటలకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో విశ్వాస పరీక్ష నిర్వహణకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 11 గంటలకు చైర్పర్సన్ వర్గానికి చెందిన కౌన్సిలర్లు కానీ.. ఆమె వ్యతిరేక వర్గానికి చెందిన సభ్యులు కానీ హాజరుకాలేదు.
అధికారులు అరగంట పాటు వేచిచూసినా కౌన్సిలర్లు రాకపోవడంతో సమావేశాన్ని 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి 12 గం టల నుంచి 12:30 గంటల వరకు వెయిట్ చేసినా సభ్యులు రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి ప్రకటించి ముగించారు. 40 రోజుల ఉత్కంఠతకు తెర పడింది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవటంతో తిరిగి ఆమెనే చైర్పర్సన్గా కొనసాగనున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన స్రవంతి ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. ఆమెతోపాటు కౌన్సిలర్లు బర్ల మంగ, రమేశ్, భానుబాబులు కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే, కాంగ్రెస్లో ఉన్న ఖానాపూర్ కౌన్సిలర్ శంకరయ్య, ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ మోహన్నాయక్ బీఆర్ఎస్లో చేరారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్న 15 మంది కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ సభ్యులతో కలిపి మొత్తం 17 మందితో చైర్పర్సన్పై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీర్మానం నెగ్గకుండా చర్యలు తీసుకున్నారు.
బలపరీక్షకు ముందే బీఆర్ఎస్లో ఉన్న శంకరయ్య, జెర్కోని బాలరాజు చైర్పర్సన్ వర్గంలో చేరారు. దీంతో విశ్వాస పరీక్ష నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవటంతో విశ్వాస పరీక్ష వీగిపోయింది. కాగా ఖానాపూర్ గ్రామానికి చెందిన కౌన్సిలర్ శంకరయ్య శుక్రవారం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరారు. మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టిన వారిలో శంకరయ్య కూడా ఉన్నారు. అవిశ్వాసానికి రెండు, మూడు రోజుల ముందు శంకరయ్య స్రవంతి వర్గంవైపు వెళ్లారు.
బలపరీక్ష నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాల యం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశా రు. ఇబ్రహీంపట్నం ఏసీపీ పీఎస్ రాజు ఆధ్వర్యంలో మం చాల, యాచారం, ఫార్మాసిటీ సీఐలతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. కార్యాలయాలకు వెళ్లే ప్రధాన రోడ్లల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
వెనుకబడిన తరగతులకు చెం దిన తనను చైర్పర్సన్ పదవి నుంచి దించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయి ధర్మం గెలిచింది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యం లో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా. తనపై అవిశ్వాసం పెట్టిన వారికి ఇదో చెంప దెబ్బ లాంటి సమాధానం.
-కప్పరి స్రవంతి, మున్సిపల్ చైర్పర్సన్