రంగారెడ్డి, జనవరి 9 (నమస్తే తెలంగాణ): తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాగవుతున్నది. సంప్రదాయ పంటలైన వరి, జొన్న, పెసర్లు, కందులు, వేరుశనగ మొదలైన పంటలను తోసివేస్తూ రోజురోజుకూ పుంజుకుంటున్నది. మెరుగైన దిగుబడి, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో చాలామంది రైతులు ఈ పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లా లో ఒక్క ఖరీఫ్ సీజన్లోనే 1,35,193.13 ఎకరాల్లో ఈ పంట సాగుఅయ్యింది. చేవెళ్ల మండలంలో 9,510 ఎకరాల్లో, మొయినాబాద్లో 776.21, షాబాద్లో 9,348.32, శంకర్పల్లిలో 3,713.38, అబ్దుల్లాపూర్మెట్లో 87. 37, ఇబ్రహీంపట్నంలో 166.07, మాడ్గులలో 50,133.35, మంచాలలో 2,028.25, యాచా రంలో 4,504.02, ఆమనగల్లులో 9,362.26, బాలాపూర్లో 3,13, కడ్తాల్లో 6,734.23, కందుకూరులో 1,140.13, మహేశ్వరంలో 2,532.18, గండిపేటలో 1.29 , శంషాబాద్లో 723.20, ఫరూఖ్నగర్లో 1,847.28, చౌదరిగూడెంలో 4,484.17, కేశంపేటలో 7,228.02, కొందుర్గ్గులో 8,0 59.11, కొత్తూరులో 1,943.37, నం దిగామ లో 2,718.37, తలకొండపల్లి మండలం లో 8,142.22 ఎకరాల్లో పత్తి పంట సాగు అయ్యిం ది. సాధారణ నేలల్లో ఎకరాకు 5నుంచి6 క్విం టాళ్ల దిగుబడి వస్తుండగా.. సారవంతమైన, బలమైన నేలల్లో ఎకరాకు 8నుంచి10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమున్నది. అయితే క్విం టాల్కు రూ.7,100మార్కెట్ ధర ఉండగా రైతులకు రూ.పది వేలకుపైనే ధర పలుకుతున్నది.
పంట కాలం..ఎనిమిది నెలలు
ఈ పంట కాలం ఏడు నుంచి ఎనిమిది నెలల వర కు ఉంటుంది. రబీ సీజన్లోనూ ఈ పంటను 50 ఎకరాల్లో సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణను చేపట్టారు. తొందరగా నీరు ఇంకిపోయేవి, రేగడి, సారవంతమైన అన్ని నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఈ పంట ను వేసేటప్పుడు నేలను రెండు నుంచి మూడు సా ర్లు దున్ని, గుంటుకతో చదును చేయాల్సి ఉంటుం దని అధికారులు చెబుతున్నారు. ఇసుక నేలలు, మరీ తేలికపాటి చల్క భూములు, ఎర్ర దుక్కులు పత్తి సాగుకు వర్షాధారంగా అనుకూలంగా ఉంటా యి. ఈ పంట 210 నుంచి 240 రోజుల్లో చేతికి వస్తుంది. జిల్లాలో మాడ్గుల, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్లు, తలకొండపల్లి, కేశంపేట, కొందు ర్గు, చౌదరిగూడెం, కడ్తాల్, యాచారం మండలాల్లోని రైతులు అధికంగా ఈ పంటను సాగు చేస్తున్నారు.
ఎకరాకు 5 నుంచి 10 క్వింటాళ్ల వరకు..
ఈ పంటను ఆరుతడిలో భాగంగా పండించాల్సి ఉంటుంది. నల్ల రేగడి భూములు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. దిగుబడి కూడా ఈ భూముల్లోనే అధికంగా వస్తుంది. వరితో పోల్చుకుంటే ఈ పంటకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. పురుగులు, తెగుళ్లు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వ్యవసాయ అధికార నిఫుణులు పేర్కొంటున్నారు. ఒక ఎకరాకు తక్కువలో తక్కువగా 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. సారవంతమైన, నల్ల రేగడి భూము ల్లో 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో క్వింటాల్కు రూ.7,100ధర ఉండగా.. రూ.10,250 వరకు ధర పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
అధికారుల సలహాలు తీసుకోవాలి
రైతులు పత్తి పంటను ఒక పద్ధతి ప్రకారం చేపట్టాలి. వ్యవసాయ అధికారులు, నిపుణులను సూచనలు, సలహాలను పాటిస్తూ సాగు చేస్తే అధిక దిగుబడిని సాధించొచ్చు. నల్ల రేగడి భూములు ఈ పం టకు అనుకూలం. విత్తనాన్ని నాటే ముందే విత్త న శుద్ధి చేపట్టాలి. దీనివల్ల ఆకుపచ్చ తెగులు రాకుండా నివారించొచ్చు. ఈ పంటతో బొబ్బ ర్లు, పెసర్లు, మినుములు, వేరుశనగ, ఉలువల ను అంతర పంటలుగా వేసుకోవచ్చు. విత్తనాలు నాటిన తర్వాత పురుగులు పంటను ఆశ్రయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, రంగారెడ్డి
150 క్వింటాళ్ల దిగుబడి రావాలి..
25 ఎకరాల్లో పత్తి పంట ను సాగు చేశా. ఇందుకు రూ.ఆరు లక్షల వరకు ఖర్చు అయ్యింది. చీడ, పురుగులు, తెగుళ్లు ఆశ్రయించకుండా వ్యవసాయాధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నా. పంట దిగుబడి 150 క్వింటాళ్ల వరకు వస్తుందని భావిస్తు న్నా. రూ. పది లక్షల వరకు లాభం రావొచ్చు.
– రెడ్డి పెద్దారెడ్డి, నల్ల చెరువు గ్రామం, మాడ్గుల మండలం
55 ఎకరాల్లో సాగు చేశా..
55 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశా. రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. వ్యవసాయాధికారులను కలిసి నాకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నా. ఈ పంట కాలం..ఎనిమిది నెలలు వరకు ఉం టుంది. దీంతో 350 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి.. దాదాపు రూ. 20 లక్షల వరకు లాభం వస్తుందని భావిస్తున్నా.
– జార్జిరెడ్డి, రెడ్డి పురం, మాడ్గుల