తాండూరు, ఏప్రిల్ 8: తాండూరు నియోజకవర్గంలో రైతాంగానికి మేలు చేసేలా సాగు నీటి రంగానికి రాష్ట్ర సర్కార్ అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడితే పంటలు, లేదంటే తంటాలు అనేలా దీనస్థితి ఉండేది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ చేసిన చక్కటి ప్రణాళికతో సాగు, తాగు నీటి ప్రగతి వికసిస్తున్నది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉన్న పరిస్థితులతో నేడు పోల్చి చూస్తే తెలంగాణ పల్లె ప్రాంతాల్లో మంచి మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. ఉద్యమ స్ఫూర్తితో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో చేట్టిన పనులు ఊరికి బతుకుదెరువుగా ఉపయోగపడుతున్నాయి. వర్షం నుంచి వచ్చిన ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టేందుకు చెక్డ్యాం (ఆనకట్ట)లు నిర్మి స్తుండడంతో రైతులకు సాగు, ప్రజలకు తాగు నీటి సమస్యలు దూరమవుతున్నాయి. అందులో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని కాగ్నా, కాక్రవేణి వాగులపై రూ. 42.74 కోట్లతో 7 చెక్డ్యాంల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
తాండూరు ప్రాంతంలో జల విప్లవం తీసుకు వచ్చేందుకు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో కాగ్నా, కాక్రవేణి నదులపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు శర వేగంగా జరుగుతున్నాయి. తాండూరు మండలం ఎల్మకన్నె వాగులో రూ.7.2 కోట్లు, చిట్టిఘనాపూర్ వాగులో రూ.5.64 కోట్లు, యాలాల మండలం కోకట్ వాగులో రూ.9.6 కోట్లు, గోవిందపూర్ వాగులో రూ.4.7 కోట్లు, బషీరాబాద్ మండలం జీవన్గి వాగులో రూ.7.4 కోట్లు, క్యాద్గీర వాగులో రూ.4.7 కోట్ల నిధులతో టెండర్లు వేసి చేపట్టిన నిర్మాణ పనులు ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి. పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి వాగులో రూ.3.5 కోట్లతో చెక్డ్యాం పనులు పూర్తయ్యాయి. వేసవికాలం చెక్డ్యాం నిర్మా ణాలకు అనువుగా ఉండడంతో తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రల నుంచి ప్రత్యేక కూలీలను తీసుకు వచ్చి కాంట్రాక్టర్లు ఆనకట్ట నిర్మాణం పనులు చేపి స్తున్నారు. నాణ్యతను పరిశీలించేందుకు సంబంధిత శాఖ అధికారులు అప్పుడప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఎల్మకన్నె చెక్డ్యాం నిర్మాణాన్ని పరిశీలించి ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.
చెక్డ్యాం నిర్మాణాలతో రైతులకు సాగునీరుతో పాటు 3 కిలో మీటర్ల పరిధిలో భూగర్భజ లాలు అభివృద్ధి చెంది నీటి నిల్వలు పెరుగనున్నాయి. ఇప్పటి వరకు తాండూరు ప్రాంతం లో ఉన్న కాగ్నానది, కాక్రవేణి నదిపై చెక్డ్యాంలు లేకపోవడంతో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోకి తాండూరు ప్రాంత వాగుల్లోని నీరు వెళుతున్నది. దీంతో ఇక్కడి రైతులు కేవలం వర్షంపై ఆధారపడే పంటలు పండించాల్సి వస్తున్నది. దీంతో తెలంగాణ సర్కార్ ప్రత్యేక కార్యాచరణతో రూపొందించిన వాగులపై ఆనకట్టల నిర్మాణంతో తాం డూరు నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఏడు చెక్డ్యాంలతో నీటి వృథాకు అడ్డుకట్ట కానుంది. దీంతో వేసవిలో కూడ రైతులు వివిధ రకాల పంటలు పండించుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చెక్డ్యాం నిర్మాణాలు తమకు ఎంతగానో ఉపయోగపడుతాయని పరివాహక ప్రాంత రైతులు, పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జల విప్లవం తీసుకువచ్చిన విధంగా తాండూరులో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో తాండూరు నియోజకవర్గంలోని కాగ్నా, కాక్రవేణి వాగుల్లో 7 చెక్డ్యాం నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. త్వరలో నియోజక వర్గంలోని ఖాంజాపూర్, చంద్రవంచ, మన్సాన్పల్లి, బెన్నూరు, దేవనూరు గ్రామ సమీ పంలోని వాగుల్లో చెక్డ్యాం నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. దీంతో వర్షం నీటిని ఒడిసి పట్టడంతో పాటు తాండూరు ప్రాంతం నుంచి కర్ణా టకు వృథాగా వెళ్లే నీళ్లకు అడ్డుకట్టగా మారుతుంది. దీంతో తాండూరు నియోజకవర్గంలోని రైతులు వర్షాదారిత పంటలే కాకుండా చెక్డ్యాంల ద్వారా నిలిచిన నీళ్లతో వేసవిలో కూడ వివిధ రకాల పంటలు పండించే అవకాశాలు ఉంటాయి. చెక్డ్యాంలు అందుబాటులోకి వస్తే వెయ్యి ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం పెరుగడంతో పాటు ఎండాకాలంలో కూడ వాగు ల్లో నీరు నిల్వ ఉంటుందని ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.