తాండూరు, డిసెంబర్ 3: అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆదివారం పరిగి వ్యవసాయ మా ర్కెట్ యార్డులో నిర్వహించిన ఓట్ల లెక్కింపు నేతల మధ్య హోరాహోరి పోటి నించింది. తాం డూరు నియోజక వర్గానికి సంబంధించి 20 రౌం డ్లలో 1,73,751 ఓట్లు లెక్కించగా బీఆర్ ఎస్ అభ్యర్థి రోహిత్రెడ్డికి 77,763 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్రెడ్డికి 83, 684 ఓట్లు వచ్చాయి.
570 ఓట్లు నోటాకు పడ్డా యి. మిగితా వారికి 11,724 ఓట్లు వచ్చాయి. 1502 పోస్టల్ బ్యాల్ ఓట్లకు గాను కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్రెడ్డికి 978, బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్రెడ్డికి 316 ఓట్లు వచ్చాయి. 28 ఓట్లు రిజెక్టు కాగా 22 ఓట్లు నోటాకు వచ్చాయి. మిగతా వారికి 158 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి బు య్యని మనోహర్రెడ్డి 6583 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్రెడ్డిపై విజయం సాధిం చారు. దీంతో తాం డూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు సం బు రాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ విజయం తో నేతలు స్వీట్లు పంచి పెట్టారు. పలు చోట్ల పటాకులు పేల్చి సంబురాలు నిర్వహించారు.