తాండూరు, డిసెంబర్ 24: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని చర్చీలు ముస్తాబయ్యాయి. తాండూరులోని సెంట్రల్ మెథడిస్ట్ చర్చితో పాటు శివాజీచౌక్, ఇంద్రానగర్లోని హెబ్రోన్చర్చి, సెయింట్ మార్క్స్ చర్చి, సాయిపూరు కింగంసాలెం చర్చి, రాజీవ్గృహకల్పలోని నజరేతు చర్చిలో శనివారం సెమి క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు వైభవంగా జరుపుకొన్నారు.
బొంరాస్పేట: క్రిస్మస్ పండుగకు మండలంలోని చర్చిలు ముస్తాబయ్యాయి. మెట్లకుంట, బొంరాస్పేట, తుంకిమెట్ల, రేగడిమైలారం, కొత్తూరు తదితర గ్రామాల్లో ్రప్రార్థనా మంది రాలను విద్యుత్ దీపాలతో, నక్షత్రాలతో, రంగు రంగుల కాగితాలు, బెలూన్లతో అందంగా అలంకరించారు. ఇండ్లపైన నక్షత్రాలను వాటిలో విద్యుత్ దీపాలను ఉంచారు. క్రిస్మస్ ట్రీ లను ఏర్పాటు చేశారు. మండలంలోని బొంరాస్పేట, మెట్లకుంట, తుంకిమెట్ల గ్రామాల్లో ఆదివారం క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మెట్లకుంట సర్పంచ్ నారాయణ, తుంకిమెట్ల ఎంపీటీసీ తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులు గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు మల్లేశ్ గౌడ్, కాంగ్రెస్ నాయ కులు రాంచంద్రారెడ్డి, నర్సింహులు నాయుడు, రాజేష్రెడ్డి, సంతోష్ పాల్గొన్నారు. మర్పల్లి: మండలంలోని కొంషట్పల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో, మొగిలిగుండ్ల, కల్ఖోడా గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలోని ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాగా మర్ప ల్లి, బంట్వారం మండలాల్లోని గ్రామాల్లో క్రైస్తవులు చర్చిలను అందంగా ముస్తాబు చేశారు.