యాచారం, ఫిబ్రవరి 26: మానవులు మట్టి పాత్రలను వినియోగించడంతోనే ఆరోగ్యంగా ఉంటారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో కుమ్మరుల ఆత్మ గౌరవ సభను ఆదివారం ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించా రు. అంతకుముందు మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన కవయిత్రి మొల్ల నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించా రు. వివిధ ఆకారాల్లో కుమ్మరులు తయారు చేసి న మట్టి పాత్రలను ఎమ్మెల్యే కిషన్రెడ్డి పరిశీలించారు. కుమ్మరుల సంక్షేమానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కిషన్రెడ్డికి కుమ్మర సంఘం నాయకు లు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ కుమ్మరుల సంక్షేమానికి ఉప్పల్లో కోట్ల విలువచేసే మూడు ఎకరాల స్థలాన్ని, రూ.3 కోట్లు నిధులను ప్రభు త్వం కేటాయించిందన్నారు.
మంచాల, యాచా రం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల తహసీల్దార్లతో త్వరలోనే చర్చించి ఎక్కడ అనువైన స్థలం ఉందో అక్కడ కుమ్మరులకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని మేడిపల్లిలో కుమ్మరుల కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కుమ్మరుల సామాజికవర్గాన్ని గౌరవిస్తూ మేడిపల్లికి చెందిన గణేశ్కు ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవిని ఇచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలో కుమ్మరుల సామాజిక వర్గానికి వంద ఇండ్లను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. మూ డు లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. యాచారం కుమ్మర సంఘం అభివృద్ధికి ఆయన తక్షణ సహాయార్థం రూ.50,000 నగదును వేదికపై మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేశ్కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, డైరెక్టర్ కళమ్మ, సర్పంచ్ ముదిరెడ్డి శ్రీధర్రెడ్డి, కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్రావు, ప్రధాన కార్యదర్శి దయానంద్, మండల అధ్యక్షుడు కొండాపురం శ్రావణ్కుమార్, నాయకులు రాజలింగం, వెంకటేశం, శ్రీనివాస్, శ్యామ్కుమార్, వీరేశం, లక్ష్మీనారాయణ, శంకర్, కృష్ణయ్య, కృష్ణ, కొం డాపురం నాగరాజు, వరలక్ష్మి ఉన్నారు.
నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి
మండలంలోని తక్కళ్లపల్లి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటేశ్, సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు కు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరగా.. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కళ్లపల్లికి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సర్పంచ్, వార్డు సభ్యులు కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష, వార్డు సభ్యులు సత్యనారాయణ, దశరథ, లక్ష్మమ్మ, భారతమ్మ, పుల్లమ్మ, రాఘవేందర్, సంపత్కుమార్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.