రంగారెడ్డి, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లో కందుకూరు డివిజన్ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ భూ ములపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కందుకూరు డివిజన్ పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకుండా ఎఫ్టీఐలు, బఫర్ జోన్లను గుర్తించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను రూపొందించాలని ఆదేశించారు.
ఆక్రమణల నివారణకు అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డీవో సూరజ్కుమార్, తహసీల్దార్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా సర్వే ల్యాండ్ అధికారి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.