రంగారెడ్డి, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఓటరు ఓటు హకును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్లో ‘స్వీప్’పై నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటనేది ఆయుధమని.. ఇప్పటికే ఓటు హకు పొందిన ప్రతి ఒకరూ ఓటు హకును వినియోగించుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండినవారు విధిగా ఎపిక్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయని, ఎకువ నియోజకవర్గాలు అర్బన్ ప్రాంతంలో ఉన్నందున ఓటింగ్ శాతం తకువ నమోదు అవుతున్నదన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న కళాశాలల విద్యార్థులు తమ ఓటు హకును వినియోగించుకునేలా స్వీప్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు 5కె రన్ నిర్వహించాలని, వాల్ పోస్టర్స్ ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. గ్రేటర్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ అసోసియేషన్ వారితో సమావేశాలు నిర్వహించి ఓటింగ్ శాతం పెంచాలన్నారు. మహిళా సంఘాలు, విద్యార్థుల ద్వారా వారి కుటుంబాల్లో ఓటుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా స్వీప్ నోడల్ అధికారి శ్రీలత, డీపీవో సురేశ్ మోహన్, డీఈవో సుశీందర్రావు, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.