పెద్దేముల్, జనవరి 12 : చెంచు జాతి ప్రజల జీవనోపాధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ నెల 15న ‘పీఎం జన్మన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చైతన్యనగర్ గ్రామంలో అధికారులతో కలిసి మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడే కార్యక్రమంలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
చైతన్యనగర్ గ్రామంలో ప్రతి వ్యక్తి, కుటుంబానికి ఆధార్కార్డు, విద్యుత్, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, జన్ధన్ అకౌంట్లు, బ్యాంకు ఖాతాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ కార్డులతో పాటు తదితర మౌలిక వసతులను కల్పించడం జరిగిందన్నారు. ఎవరైనా మిగిలి ఉంటే వారికి సైతం అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండుగను సెలవుదినంగా భావించకుండా పని చేయాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో తాండూరు ఆర్డీవో శ్రీనివాస్రావు, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఇందిరా, డీటీడీడబ్ల్యూవో కోటాజీ, ఎల్డీఎం రాంబాబు, ఈడీఎం మహమూద్ అలీ, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలితాకుమారి, డీఏవో గోపాల్, తహసీల్దార్ కె.కిషన్, ఆర్ఐ రాజురెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ వీరేశం, పంచాయతీ కార్యదర్శి నాగరాణి, సర్పంచ్ పి.లలిత, డాక్టర్ బుచ్చిబాబు, లోన్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, ప్రమోద్కుమార్, ఫీల్డ్అసిస్టెంట్ వెంకటయ్య పాల్గొన్నారు.