ఇబ్రహీంపట్నం, మార్చి 22 : ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరిపై 16 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 4న బలపరీక్ష నిర్వహించటానికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్కు చెందిన చైర్మన్ కప్పరి స్రవంతి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో చేరారు.
దీంతో ఆమెపై బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన 17మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టగా వీగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ వైస్చైర్మన్ ఆకుల యాదగిరిపై అవిశ్వాస తీర్మానం పెట్టగా.. బలపరీక్ష నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏప్రిల్ 4వ తేదీ నిర్వహించే బలపరీక్షకు హాజరుకావాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లకు నోటీసులను అందజేశారు.
చైర్పర్సన్పై అవిశ్వాసం ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరించిన వైస్ చైర్మన్ ఆకుల యాదగిరిని దించేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా మద్దతు పలికారు. దీంతో వైస్ చైర్మన్ పదవి ఆశిస్తున్న బర్ల మంగ కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఇప్పటికే క్యాంపునకు తరలించారు.