అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉన్నదని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రైతుబంధు కింద జిల్లాలో వానకాలం సీజన్ రూ.344కోట్లు, యాసంగిలో ఇప్పటి వరకు రూ.290కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా మిషన్భగీరథ పథకం కింద రూ.4,476కోట్లతో వాటర్ట్యాంకులు, పైప్లైన్లు వేసి తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ‘మన ఊరు- మనబడి’ కింద మొదటి విడుతలో 464 పాఠశాలలు ఎంపిక య్యాయని పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాల చెక్కులు, వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఇబ్రహీంపట్నం, జనవరి 26 : రంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అగ్రస్థానంలో ఉందని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. నూతనంగా సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని 35 ఎకరాల్లో నిర్మించుకుని అన్ని శాఖలు ఒకే చోట నుంచి పరిపాలన సాగిస్తుండటం శుభసూచకమన్నారు. రైతు బంధు ద్వారా ఈ వానకాలంలో రైతుల ఖాతాల్లో రూ.344 కోట్లు, యాసంగిలో ఇప్పటివరకు 2.92 లక్షల మందికి రూ.290 కోట్లను జమచేసినట్లు తెలిపారు.
రైతు బీమా కింద 373 మంది రైతులు మరణించగా, వారిలో 295మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.14.75 కోట్లను అందజేసినట్లు పేర్కొన్నారు. దళిత బంధు కింద 8 నియోజకవర్గాల్లో 697 మంది లబ్ధిదారులకు సుమారు రూ.69.70 కోట్లను అందించామన్నారు. రూ.4,476 కోట్లతో మిషన్ భగీరథ కింద ప్రజలకు తాగునీరు అందించినట్లు తెలిపారు. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద మొదటి విడుతలో 464 పాఠశాలలను ఎంపిక చేసి రూ.97.88 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 2022-23 సంవత్సరానికి 5,285 మంది ఆడపడుచులకు రూ.52.90 కోట్లను అందజేసినట్లు చెప్పారు. పశుపోషణ, గ్రామీణాభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. మత్స్యశాఖ ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 614 చెరువులకు రూ.1.28 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళా సంక్షేమం, పురోగతి సంతృప్తికరంగా ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి తనతో పాటు పనిచేస్తున్న జిల్లాకు చెందిన అధికారులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.