కొడంగల్ : సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఆరోగ్య భరోసాను కల్పిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణానికి చెందిన బాలప్పకు రూ. 26వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి రోజుల్లో వైద్యం ఖరీదుగా మారిందని, బీద ప్రజలు ఆరోగ్య చికిత్స నిర్వహించుకోవడా నికి ఎంతో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. అటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.