కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని గోవిందాయిపల్లి తండా సంతోశ్నాయక్కి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకరంతో రూ. 24వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారుడికి ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ దవాఖానలో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని, ఈ పథకం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిదని తెలిపారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్యాదవ్ నాయకులు పాల్గొన్నారు.