తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన రమేశ్ ఆనారోగ్యానికి గురయ్యారు. కాగా బాధితుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రమేశ్కు రూ. 32వేల విలువ గల చెక్కు మంజూరైంది.
మంజూరైన చెక్కులను ఆదివారం బాధితుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బాధితులకు అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.