షాద్నగర్టౌన్, జనవరి 31: షాద్నగర్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డునూ మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 6వ వార్డులో అంతర్గత మురుగుకాలువ నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో వార్డులన్నీ ఎంతో సుందరంగా మారాయన్నారు. వార్డుల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో వార్డు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సీసీ రోడ్డులు, అంతర్గత మురుగు కాలువలు, వీధి దీపాలను ఏర్పాటు చేశామన్నారు. మున్సిపాలిటీలో ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, నాయకులు పులిమామిడి శ్రీశైలంగౌడ్, బాలు, శివ, స్థానికులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపాలిటీలోని 17వ వార్డుకు చెందిన నసీమాబేగానికి రూ. 2.50 లక్షలు, ఫరూఖ్నగర్ మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్కు రూ.43,500, రాయికల్ గ్రామానికి చెందిన విజయ్కుమార్కు రూ. 60 వేలు, కమ్మదనం గ్రామానికి చెందిన అఖిలకు రూ. 13,500ల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిరుపేద ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, కౌన్సిలర్ అంతయ్య, మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకులు జూపల్లి శంకర్, వెంకట్రెడ్డి, సలీం, రవి, యాదయ్య, దామోదర్, రాఘవేందర్ పాల్గొన్నారు.