కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని చరికొండ గ్రామానికి చెందిన అంజమ్మకి రూ. 14 వేలు, ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన పద్మకి రూ.13,500 వేలు, తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మకి రూ.17వేలు, చింతపల్లికి చెందిన శ్రీశైలంకి రూ.22,500, మాడ్గుల్ మండలం అజిలాపూర్ చెందిన రూ.2,25,000 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి.
శుక్రవారం హైదరాబాద్లోని తప కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, నాయకులు సురేందర్రెడ్డి, కృష్ణ, కేశవులు, చందుగౌడ్, పురుషోత్తంరెడ్డి, యాదగిరి, అల్లాజీ, రేణురెడ్డి, సుమన్గౌడ్ పాల్గొన్నారు.