సకల జనుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం చౌదరిగూడలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకూ తీసుకెళ్లాలన్నారు. వందల కోట్లు వెచ్చించి షాద్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో గ్రామాలు కనీస మౌలిక వసతులకు నోచుకోలేదన్నారు. కానీ నేడు సీఎం కేసీఆర్ సుపరిపాలనలో మారుమూల గ్రామాలు సైతం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ మరోసారి విజయం సాధిస్తుందన్నారు. అందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు.
అలాగే షాబాద్ మండలంలోని మక్తగూడలో జరిగిన పార్టీ సమ్మేళనంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.25కోట్ల హెచ్ఎండీఏ నిధులతో చేవెళ్ల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చందనవెల్లిలో ఏర్పాటు చేసిన వివిధ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా అక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి, రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీని అందించాలని కోరారు. అంతకుముందు జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.
షాబాద్, మార్చి 23 : బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండలంలోని మక్తగూడ గ్రామంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో పది గ్రామాలు సీతారాంపూర్, పోతుగల్, నాగరగూడ, తాళ్లపల్లి, లక్ష్మారావుగూడ, తిమ్మారెడ్డిగూడ, ఏట్ల ఎర్రవల్లి, రేగడిదోస్వాడ, తిర్మలాపూర్, మక్తగూడ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యఅతిథిగా హాజ రు కాగా.. అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఏం చేస్తున్నదని అడుగుతున్న ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా…? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.25 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నల్లానీరు అందించి ఆడబిడ్డల తాగునీటి కష్టాలను తీర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
రూ.5 కోట్లతో తాళ్లపల్లి-పామెన వాగుపై, రూ.3.30 కోట్లతో రేగడిదోస్వాడ వాగు పై, రూ.5 కోట్లతో హైతాబాద్-నక్కల్లిపల్లి వాగుపై వం తెనల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్లు తెలిపారు. చందనవెల్లిలో వెలిసిన పలు పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లా ఇక్కడే స్కిల్ డవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, బీటీ రోడ్లు నిర్మించినట్లు వివరించారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకా లు అందుతున్నాయన్నారు.
నగరానికి దగ్గర్లో ఉన్న షాబాద్ మండలంతోపాటు, చేవెళ్ల నియోజకవర్గం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందడం ఖాయ మన్నారు. బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపే తం చేసి, రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీని అందించాలని కోరారు. మండలంలోని నాలుగు క్లస్టర్ల పరిధిలోని 41 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు ఒక పండుగ వాతావరణంలో కొనసాగ గా.. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి మాట్లాడు తూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముం దుకు సాగుతున్నట్లు తెలిపారు. గత ఉమ్మడి ప్రభుత్వా ల పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన షాబాద్ మం డలం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అన్ని రం గాల్లో అభివృద్ధిలో ముందున్నదన్నారు. జడ్పీచైర్పర్స న్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహకారంతో మండలానికి రూ.కోట్లాది నిధులను తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తునట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తున్నామన్నారు.
ఐటీశాఖ మం త్రి కేటీఆర్ స్ఫూర్తితో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా నా సొంత నిధులతో మండలంలోని దివ్యాంగులకు ఉచితంగా ట్రై స్కూటీలు, పేద మహిళలకు కుట్టుమిష న్లు అందించినట్లు గుర్తు చేశారు. ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. బీఆర్ఎస్కు ప్రజలందరూ అండగా ఉండాలన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షు డు గూడూర్ నర్సింగ్రావు, పార్టీ రాష్ట్ర నాయకులు శేరిగూడెం వెంకటయ్య, నక్క శ్రీనివాస్గౌడ్, కొలన్ ప్రభాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీశైలంగౌడ్, మండల యూత్ అధ్యక్షుడు సతీశ్రెడ్డి, పీఏసీఏస్ వైస్ చైర్మన్ మల్లేశ్, డైరెక్టర్ రాజారత్నం, మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఆయూబ్, సర్పంచులు పాండురంగారెడ్డి, కృష్ణగౌడ్, అనిత, పెంటయ్య, రాములు, శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీలు పార్వతమ్మ, సునీత, పార్టీ మండల నాయకులు నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీశైలంగౌడ్, అనంతయ్య, గోపాల్రెడ్డి, సుధాకర్ గౌడ్, అంజయ్య, లక్ష్మయ్య, మునీర్, సందీప్, శేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.