బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాతృమూర్తి పద్మమ్మ దశదినకర్మ ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో జరిగింది. సీఎం కేసీఆర్ హాజరై పద్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఎమ్మెల్యే కిషన్రెడ్డిని పరామర్శించారు. సీఎంతో పాటు మంత్రులు సబితాఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, మల్లారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, అధికారులు పాల్గొని పద్మమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఇబ్రహీంపట్నం, మే 28 : బీఆర్ఎస్ పార్టీ రంగారెడి ్డజిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాతృమూర్తి, కీర్తిశేషులు మంచిరెడ్డి పద్మమ్మ దశదిన కర్మ ఆదివారం ఎలిమినేడు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు సబితాఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, మల్లారెడ్డితోపాటు ఎంపీలు నామ నాగేశ్వరరావు, రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, కేపీ వివేకానంద, బాల్కసుమన్, జీవన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కలెక్టర్ హరీశ్, రాచకొండ సీపీ చౌహాన్, రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, ఇబ్రహీంప ట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల కు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై పద్మమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్ ద్వారా ఎలిమినేడు గ్రామానికి చేరుకుని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వారి ఇంటికెళ్లి కిషన్రెడ్డిని పరామర్శించి, మం చిరెడ్డి పద్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా హెలిప్యాడ్ వద్ద మంత్రి సబితాఇంద్రారెడ్డి, కలెక్టర్ హరీశ్, సీపీ చౌహాన్లు సీఎంకు స్వాగతం పలికారు.
జనసంద్రమైన ఎలిమినేడు గ్రామం..
ఇబ్రహీంపట్నం రూరల్, మే 28 : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాతృమూర్తి మంచిరెడ్డి పద్మమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి వివిధ పార్టీల నాయకులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ప్రజ లు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆదివారం ఎలిమినేడు గ్రామం జనసంద్రమైంది. సీఎం కేసీఆర్ హాజరు కావడంతో జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉదయం నుంచే ఎలిమినేడుకు చేరుకున్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, వైస్ చైర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెం దిన టీపీసీసీ కార్యదర్శి శివకుమార్, కౌన్సిలర్ మంగమ్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్గౌడ్, రమేశ్, బుగ్గరాములు, కిషన్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు యాదగిరి, కళమ్మ, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీఎం రాకతో భారీ బందోబస్తు..
మంచిరెడ్డి పద్మమ్మ దశదిన కర్మకు సీఎం కేసీఆర్ హాజరైన సందర్భంగా పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ చౌహాన్ పర్యవేక్షణలో ఎలిమినేడుతోపాటు ఇబ్రహీంపట్నం నుంచి ఎలిమినేడు వర కు బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి ఎమ్మెల్యే ఇంటివరకు అడుగడుగునా పోలీసులు పహారా నిర్వహిం చారు. పలువురు డీసీపీలు, ఏసీపీలు భారీ బందోబస్తును పర్యవేక్షించారు.