శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ స్థాపించిన రైల్వ్కోచ్ ఫ్యాక్టరీని గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించా రు. అనంతరం ఆయన ఎలక్ట్రిక్ వాహనంలో ఫ్యాక్టరీ అంతా కలియ తిరిగి సంస్థలోని యంత్రాల విడి భాగాలు, చేపట్టిన పనులు, సాంకేతికత, ఉద్యోగుల నైపుణ్యాన్ని స్వయంగా పరిశీలించారు.
రానున్న రోజుల్లో ఈ ఫ్యాక్టరీ మరింతగా ఎదగాలన్నారు. ఎల్లప్పుడూ ప్రభుత్వ మద్దతు ఉంటుందని.. పరిశ్రమను మరింత విస్తరించి రాష్ర్టానికి.. దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సంస్థలో వందలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు.