సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతలు బాగుంటేనే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధాని పోలీస్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా మూడు కమిషనరేట్లతో మెగా పోలీసింగ్గా తీర్చిదిద్దారు. 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే శాంతిభద్రతలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. పోలీస్ శాఖలో తీసుకొచ్చిన టెక్నాలజీ, ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్తో రాష్ట్రంలో పటిష్ట శాంతిభద్రతలు ఏర్పడి, నేరాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, ప్రజలు స్వేచ్ఛగా రోడ్లపై తిరిగేలా ప్రశాంత వాతావరణాన్ని ఈ తొమ్మిదేండ్లలో కల్పించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ నేరస్థులకు మాత్రం సింహాస్వప్నంగా ఉంటున్నారు. దీంతో ప్రజలకు పోలీసులపై విశ్వాసం పెరిగి, అన్ని విషయాల్లోనూ పోలీసులకు సహకరిస్తున్నారు. మరోపక్క హ్యాక్ ఐయాప్ను పోలీసులు, ప్రజలకు మధ్య వారధిగా ఉపయోగిస్తున్నారు, పలు రకాలైన సేవలను ఆన్లైన్లోనే అందిస్తున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 7.5 లక్షల సీసీ కెమెరాలను ఏర్పా టు చేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా సీసీ కెమెరా లు కలిగిన నగరాల జాబితాలో హైదరాబాద్ ముందు వరుసలో నిలిచింది. ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పా టు చేస్తూ నేను సైతం కార్యక్రమం ద్వారా ప్రజలను ప్రోత్సహిస్తూ వారి ద్వారా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నది. దీంతో శాంతిభద్రతలు పటి ష్టంగా ఉండటంతోపాటు నేరాలు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా పెట్రోలింగ్ వ్యవస్థ నూ పటిష్టం చేశారు. ఏదైనా ఘటన జరిగితే ఘటనాస్థలికి ఐదు నిమిషాల వ్యవధిలోనే చేరేలా చర్యలు తీసు కున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యాధునిక పెట్రోలింగ్ కార్లు, బ్లూకోల్ట్స్ వాహనాలను సమకూర్చారు. డయల్ 100 నుంచి పెట్రోలింగ్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. దీంతో బాధితులు ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోనే ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సేవలను అందిస్తున్నారు. ప్రతి కానిస్టేబుల్కూ ట్యాబ్లు అందించారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ముఖ్య ప్రాం తాలు, డ్యామ్లు, ప్రార్థన, పర్యాటక సంస్థలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నెట్వర్క్ను ఇక్కడ అనుసంధానం చేశారు. విపత్తుల సమయంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ఇక్కడి నుం చి ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ఏర్పా ట్లు చేశారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాం టీ నార్కొటిక్ బ్యూరోలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా మహిళల భద్రత కోసం ప్రభుత్వం షీ టీమ్స్ బృందాల ను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ను కట్టడి చేసేందుకు హైదరాబాద్లో ప్రత్యేకంగా హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్నూ ఏర్పాటు చేశారు. ఈ విభాగం ద్వా రా డ్రగ్స్ వాడకాన్ని కట్టడి చేస్తున్నారు. ఇటీవలి కాలం లో సైబర్ నేరాలు భారీగా పెరిగాయి. ఈ నేరాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసింది.
శాంతిభద్రతలు బాగున్నప్పుడే అభివృద్ధి సాధ్యమని.. తెలంగా ణ ఏర్పడగానే పోలీస్ శాఖలో టెక్నాలజీతో కూడిన పలు సంస్కరణలు తీసుకొచ్చా రు సీఎం కేసీఆర్. ఆయన స్ఫూర్తితో నేడు హైదరాబాద్ మహానగ రం ప్రపంచంలోనే సురక్షితంగా నగరంగా మారింది. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ఈవ్టీజింగ్ను కట్టడి చేసేందుకు షీటీమ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తున్నది. ప్రజలు డయల్ 100కు ఫోన్ చేస్తే పట్టణాల్లో 5 నిమిషాల్లో.. రాచకొండలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.3 నిమిషాల్లో సంబంధి త వ్యక్తుల వద్దకు పోలీసులు చేరుకుంటున్నారు. నేరా లు జరిగితే 24నుంచి 48 గంటల్లో ఛేదించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
-డీఎస్ చౌహాన్, రాచకొండ పోలీస్ కమిషనర్
నెక్ట్స్ జనరేషన్ పోలీసింగ్పై దృష్టి పెట్టాం. సైబరాబాద్ పోలీసింగ్ అంటే కేవలం ఒక ప్రాంతానికో లేదా తెలంగాణ రాష్ర్టానికో పరిమితం కాదు. మల్టీకల్చర్ ఉండే సైబరాబాద్లో పరిమిత పోలీసింగ్ సరిపోదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సైబరాబాద్ అనేది అంతర్జాతీయ హబ్గా మారింది. దీనికి తోడు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడే ఉండటంతో మన దేశం నుంచే కాకుండాప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వారు కూడా రాకపోకలు సాగించడం, ఉద్యోగాలు చేయడం వంటి వివిధ అంశాలతో సైబరాబాద్ అనేది మినీ గ్లోబల్గా మారింది. అందుకోసం ప్రతి ఒక్కరి సంస్కృతీసంప్రదాయాలను గౌరవిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలకు భద్రత కల్పించాలనేది సీఎం కేసీఆర్ విజన్. ఆయన సూచనల మేరకు సైబరాబాద్ పోలీసింగ్ను అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా మెగా పోలీసింగ్ వ్యవస్థగా తీర్చిదిద్దడం జరిగింది. మెగా పోలీసింగ్లో భాగంగా సైబరాబాద్ను రెండుగా విభజించి.. రాచకొండ పేరుతో కొత్త కమిషనరేట్ను ఏర్పాటు చేయడం జరిగింది.
-స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీసు కమిషనర్