షాబాద్, ఆగస్టు 8: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. చేవెళ్లకు వంద పడకల దవాఖాన మంజూరు, రైతులకు రుణమాఫీ చేయడంపై హర్షిస్తూ మంగళవారం నగరంలోని ప్రగతిభవన్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ఈసీ, మూసీ వాగులపై నూతన వంతెనలు నిర్మించేందుకు నిధులను కేటాయించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే యాదయ్య విజ్ఞప్తి చేశారు.