న్యూస్ నెట్వర్క్, (నమస్తే తెలంగాణ): సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో చేయూతనందిస్తున్నది. ఇప్పటికే గొల్ల, కురుమలు, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర సర్కార్ బీసీ కులాలు, చేతివృత్తుల వారి అభ్యున్నతికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు శ్రీకారం చుట్టింది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 20 మంది లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రూ.లక్ష చొప్పున సాయాన్ని అందజేసింది. అర్హులు ఈనెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పనిముట్లు, ముడిసరుకులు కొనుగోలుకు సర్కారు సాయమందిస్తున్నది. ఈ పథకానికి 18 నుంచి 55 ఏండ్లలోపు వారు అర్హులు. బీసీ కులాల్లోని నాయీబ్రాహ్మణులు, రజక, సగర, కుమ్మరి, అవుసుల, కంసాలి, వడ్రంగి, వడ్డెర, కమ్మరి, కంచరి, మేదర, కృష్ణ బలిజ పూస, మేర, ఆరె కటిక, ఎంబీసీ కులాలకు చెందినవారికి సర్కారు సాయమందించనున్నది.
కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే గొల్ల, కురుమలు, మత్స్యకారులు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ఆర్థిక తోడ్పాటునందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కుల, చేతివృత్తుల వారి నిమిత్తం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీసీ కుల, చేతివృత్తుల వారికి రూ.లక్ష ఆర్థికసాయం చేస్తూ చేయూతనందిస్తుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 20 మంది లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయాన్ని అర్హులకు అందజేశారు. అర్హులైన వారు ఈనెల 20 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తదనంతరం దరఖాస్తుల వారీగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేయనున్నారు. బీసీ కుల, చేతివృత్తులకు చెందిన వారు వృత్తి పనిముట్లు, ముడిసరుకులు కొనుగోలు చేసేందుకుగాను ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నది. రూ.లక్ష ఆర్థికసాయాన్ని కుటుంబంలో ఒకరికి మాత్రమే అందజేయనున్నారు. ఈ పథకానికి 18 ఏండ్ల నుంచి 55 ఏండ్లలోపు వారు మాత్రమే అర్హులు. గ్రామాల్లో 1.50 లక్షలలోపు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనున్నది. బీసీ కులాల్లోని నాయీబ్రాహ్మణులు, రజక, సగర, కుమ్మరి, అవుసుల, కంసాలి, వడ్రంగి, వడ్డెర, కమ్మరి, కంచరి, మేదర, కృష్ణ బలిజ పూస, మేర, ఆరె కటిక, ఎంబీసీ కులాలకు రూ.లక్ష ఆర్థికసాయాన్ని అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్థిక సాయం అందించడం అభినందనీయం
గత పాలకుల హయాంలో వెనుకబాటు తనానికి గురైన కులవృత్తులకు ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవం పోస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కులవృత్తుల సంక్షేమానికి లక్షరూపాయలు అందించి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దే. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కుమ్మరులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
– కాసుల పాండు, కుమ్మర సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు (ఇబ్రహీంపట్నం)
సీఎం కేసీఆర్ బీసీల పక్షపాతి
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులవృత్తులు చేసే వారికి లక్ష రూపాయాలు అందించడం గొప్ప విషయం. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా సాయం అందిస్తున్న కేసీఆర్కు అండగా నిలవాలి. పేదల సంక్షేమ కోసం నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. కులవృత్తులు ఆర్థికాభివృద్ధిని సాధించేలా అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి భరోసాను కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ బీసీల పక్షపాతి అనడానికి ఇదే నిదర్శనం.
– రాజేశ్గౌడ్,శంకర్పల్లి, బీసీ నాయకుడు
సంతోషంగా ఉంది
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చేతి, కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. బీసీలకు ఎంతోగాను ఉపయోగపడుతాయి. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటాం. అన్ని వర్గాలను గుర్తించి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నరు.
–భూతరాజు రమేశ్, సాకలికులం, నల్లచెరువు గ్రామం
రజకులకు రూ. లక్ష ఆర్థికసాయం
కులవృత్తి పై ఆధారపడి జీవిస్తున్న రజకులు ఆర్థికంగా ఎదుగడం కోసం ప్రభుత్వం లక్ష ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది. కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న బీసీ కుటుంబాలకు ముడిసరుకులు, పనిముట్ల కొనుగోలు కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నందుకు బీసీలందరం కేసీఆర్కు రుణపడి ఉంటాం. గత ప్రభుత్వల హయాంలో బీసీ కులాలను పట్టించుకోలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక బీసీల కష్టాలు తెలుసుకున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికసాయం చేయడం అభినందనీయం.
–వై. కృష్ణ, రజకుడు చేవెళ్ల
కేసీఆర్కు రుణపడి ఉంటా
ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులను ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు 100శాతం రాయితీతో రూ.లక్ష అందించడంతో ఆనందంగా ఉంది. అన్ని కుల వృత్తుల వారికి రూ.లక్ష అందించించి తోడ్పాటును అందిస్తున్నారు. దౌల్తాబాద్ మండలంలోనే కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మొట్ట మొదటగా నాకు రూ.లక్ష చెక్కును అందించారు. వారికి, నా ప్రత్యేక కృతజ్ఞతలు.
– కుమ్మరి శేఖర్ దేవర్ఫస్లవాద్, దౌల్తాబాద్ మండలం
సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడు
నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల, చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడు. ఇప్పటికే రజకులు, నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను అందిస్తున్నారు. మరుగున పడిపోయిన కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ఆర్థికసాయం అందిస్తూ వెన్నుదన్నుగా సీఎం కేసీఆర్ నిలిచారు.
– డేరంగుల వెంకటేశ్, వడ్డెర సంఘం జిల్లా నాయకుడు
ఇంటింటికీ పథకాలు అందుతున్నాయి
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కుల, చేతి వృత్తుల వారు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో అర్హులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించడం హర్షణీయం. నాకు వచ్చిన రూ.లక్షతో కొత్త యంత్రాలను కొనుగోలు చేసి కుటుంబాన్ని పోషించుకుంటా.
–సోమరాజు శ్రీరాములు (రజక), కడ్తాల్ మండలం
కుల వృత్తులను ప్రోత్సహించడం హర్షణీయం
పూర్వం నుంచి కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నాం. మాలాంటి వారి కోసం ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నది. కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. సీఎం కేసీఆర్ మా కష్టాలను తెలుసుకుని మాకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రూ.లక్ష అందించడంతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– రమేశ్, నాయీబ్రాహ్మణుడు, వికారాబాద్
కుల వృత్తులకు మనుగడ..
చేతి వృత్తులు అంతరిస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్ చేతి, కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకుంటున్నందుకు ధన్యవాదాలు. చేతి వృత్తుల వారికి ఆదరణ కురువు కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు ఎందరో ఉన్నారు. నేడు ఆధునిక యుగానికి తగినట్లుగా హంగులు ఆర్భాటాలు ఉంటేనే కుల వృత్తులకు మనుగడ ఉంది. ప్రస్తుతం నేను కుల వృత్తిని చేసుకొంటూ జీవనం కొనసాగిస్తున్నా. కుల వృత్తిపై ఆసక్తి ఉన్న వారు ఒక చోట దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నది. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో నా కుల వృత్తిని సంతోషంగా నిర్వహించుకుంటున్నా.
– శేఖర్, నాయీబ్రాహ్మణులు, కొడంగల్
పేదలను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్సే
పేదప్రజల కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారు. రజకులు, నాయీబ్రాహ్మణులకు లాండ్రీషాపులు, బార్బర్ దుకాణాలకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తుండటంతో పాటు కులవృత్తులు చేసుకుని జీవించే వారికి లక్షరూపాయల ఆర్థికసాయం ప్రకటించటం ఎంతో సంతోషకరం. అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– మడుపు శివసాయి, రజకసంఘం నాయకుడు (ఇబ్రహీంపట్నం)