మొయినాబాద్ : కరోనా మహమ్మారిని జయించడానికి అన్ని మత మందిరాల్లో సిబ్బందికి కొవిడ్ టీకాలను వేయాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయంలోని అర్చకత్వం నిర్వహిస్తున్న అర్చకుల కుటుంబ సభ్యులకు, ఆలయ సిబ్బందికి రెండో డోస్ వేశారు. సుమారుగా 50మందికి టీకాలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల్లో చిలుకూరు బాలాజీ ఆలయంలోనే మొదటిసారిగా సిబ్బందికి కొవిడ్ టీకా వేయించడానికి ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆలయాల్లోని సిబ్బందికి టీకాలు వేయిస్తే భక్తులకు సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.