కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన శివయ్యకి రూ. 40వేలు, సత్యస్వరూప్కి రూ. 36 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. మంగళవారం హైదరాబాద్లోని తన కార్యలయంలో ఎమ్మెల్సీ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం అందుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, రాజు, రవి, రాములుయాదవ్, యోగి పాల్గొన్నారు.