సీఎం కేసీఆర్ జనరంజక పాలనతో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించిందని, మరోసారి జయం మనదేనని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్రెడ్డి అన్నారు. సోమవారం మొయినాబాద్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గడప గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. గ్రామగ్రామాన పారిశుధ్యం పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలతో మన రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, వారి సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు, కార్యకర్తలు అడుగులు వేయాలన్నారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మొయినాబాద్ గులాబీమయంగా మారింది. పార్టీ నేతలు, కార్యకర్తల భారీ ర్యాలీ, కళాకారుల ఆటాపాట, ‘జై కేసీఆర్.. జైజై భారత్’ అనే నినాదాలతో మొయినాబాద్ హోరెత్తింది.
రంగారెడ్డి, మార్చి 27 (నమస్తే తెలంగాణ): అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందున్నదని.. దేశంలోని పలు రాష్ర్టాలు ఇక్కడ అమలవుతున్న పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సోమవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో మొయినాబాద్లోని అంజనాదేవి గార్డెన్స్లో పెద్ద ఎత్తున జరిగింది. దీనికి ముఖ్య నాయకులే కాకుండా మండలంలోని మొయినాబాద్, సురంగల్, శ్రీరామ్నగర్, వెంకటాపూర్, కేతిరెడ్డిపల్లి, నక్కలపల్లి, ఎత్తబారపల్లి, తోలుకట్ట, అప్పారెడ్డిగూడ, కనకమామిడి గ్రామాల నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో గార్డెన్ పరిసరాలు రద్దీగా మారాయి. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జనరంజక పాలనతో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించిందని, మరోసారి జయం మనదేనని స్పష్టం చేశారు. ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి. ఏ పార్టీకి లేని ఆ ధైర్యా న్ని సీఎం కేసీఆర్ ప్రతి ప్రజాప్రతినిధికీ కల్పించా రని.. మనం ఈ రోజు ఇక్కడ ఈ స్థితిలో ఉన్నామంటే అందుకు కారణం మన పార్టీ అభిమాను లు, ప్రజలైన మన కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. ఈ తొమ్మిదేండ్ల పాలనలో వారు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలను ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ సంతోషంగా ఉం దంటే అది కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు.
రూ. 40 వేల కోట్లతో జరుగుతున్న పాలమూరు-రంగారెడ్డి జిల్లాల ఎత్తిపోతల పథకం పను లు కొనసాగుతున్నాయని.. ఆ నీరు జిల్లా అం తటా పారే రోజులు దగ్గర్లొనే ఉన్నాయన్నారు. మూసీనది జలాలు స్వచ్ఛంగా ఉం డాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కార్యాచరణ జరుగుతున్నదన్నారు. శంషాబాద్ నుంచి సిద్ధాంతి చౌరస్తా వరకు ఫ్లై ఓవర్ను విస్తరించాలని ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరి తో మాట్లాడి అనుమతి పొందినట్లు ఎంపీ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమా లు తెలంగాణలో కొనసా గుతున్నాయని.. ఇంటింటికీ అందుతున్నాయన్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాలను పొరు గు రాష్ర్టాలతోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతున్నారన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధి అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లోని నగరాలకు తీసిపోదని, రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లోని ప్రముఖ నగరాల జాబితాల్లో హైదరాబాద్ నగరం ప్రధానంగా నిలువనున్నదని ఎంపీ ఆశాభావాన్ని వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో స్వప్న, జడ్పీటీసీ శ్రీకాంత్, మాజీ ఎం పీపీ కొంపల్లి అనంతరెడ్డి, మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. 14 ఏండ్ల ఉద్యమ పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తర్వాత.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. మిషన్ కాకతీయతో జిల్లాలోని వందలాది చెరువులను పునరుద్ధరించుకున్నామని.. జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు అందుతున్నదన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వసతులు పెరగడంతోపాటు.. మెరుగైన వైద్యం అందుతున్నదని ఇదంతా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. సభ కు ముందు మొయినాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కళాకారులు ఆట,పాటలతో నృత్యాలు చేస్తూ హంగామా చేశారు. పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ‘జై కేసీఆర్.. జైజై భారత్’ అంటూ జెండాలు చేబూని నినాదాలు చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.