చేవెళ్ల రూరల్, నవంబర్ 4 : మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యా దయ్య, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి పంచాయతీ పరిధిలో ముస్లిం మైనార్టీ సోదరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింల మద్దతు బీఆర్ఎస్కు ఇవ్వాలని కోరారు. అనంతరం చేవెళ్ల మండల ముస్లిం నాయకులు ఎమ్మెల్యే యాదయ్యను అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తీర్మానం చేశారు.
కార్యక్రమం లో వైస్ ఎంపీపీ శివప్రసాద్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బాల్ రాజ్, బీఆర్ఎస్ మండల బీసీసెల్ అధ్యక్షుడు ఎదిరె రాములు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ శివనీలచింటు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రామాగౌడ్, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, బీఆర్ఎస్ మండ ల ప్రధాన కార్యదర్శులు నరేందర్గౌడ్, హన్మంత్ రెడ్డి, సర్పంచ్లు శేరి స్వర్ణలతాదర్శన్, భీమయ్య, లావణ్యాశంకర్, జహంగీర్, వెంకటేశం గుప్తా, గుడిమలాపూర్ మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి, మారెట్ కమిటీ డైరెక్టర్ ఫయాజ్, బీఆర్ ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఘని, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, సివిల్ సప్లయ్ జిల్లా సభ్యుడు దండు రవీందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మద్దెల జంగయ్య, వంగ శ్రీధర్ రెడ్డి, శేరి రాజు, సాయినాథ్, రాంరెడ్డి, ఎల్లన్న, నర్సింహులు, మైనార్టీ నాయకుడు ఎంఏ బాసిత్, చేవెళ్ల జామ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్, మల్కాపూర్ ఉప సర్పంచ్ సయ్యద్ జాఫర్, మైనార్టీ నాయకులు ఇక్రం, ఫయిం, ఫయాజ్ పాలొన్నారు.
చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్యను గెలిపించాలని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నా రు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వే యాలని అభ్యర్థిస్తున్నారు. శనివారం మండల పరిధిలోని గొల్లపల్లి, ధర్మసాగర్ గ్రామాల్లో ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.
మొయినాబాద్ : సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీ నా యకులు చీడ పీడ లాంటివారని అలాంటి వారిని తిరస్క రించాలని బీఆర్ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం మండల పరిధిలోని కనకమామిడి, సజ్జన్పల్లి, మొయినాబా ద్ గ్రామాల్లో ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకా లను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమం లో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ అ నంతరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేంద ర్రెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షు రాలు స్వప్న, కనకమామిడి సర్పంచ్ జనార్ద న్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు వెంకట్రెడ్డి, గణేశ్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్య క్షులు జయవంత్, బాల్రాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, సర్పంచ్లు రాఘవరెడ్డి, కుమార్, మనోజ్కుమార్, అంబాజీ రావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మల్లేశ్, అర్జున్, మాజీ సర్పంచులు శ్రీహరియాద వ్, రత్నం, బీఆర్ఎస్ లీగల్ సెల్ మండల అధ్యక్షుడు సు రేందర్రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్య క్షుడు పరమేశ్, ఏఎంసీ డైరెక్టర్లు సంగం రాజూగౌడ్, రాము, మాజీ వైస్ చైర్మన్లు వెంకట్రెడ్డి, డప్పు రాజు, సీనియర్ నాయకులు షేక్ మహబూబ్, రాఘవేందర్యాదవ్, షాబాద్ ప్రవీణ్, షుకూర్, సంజీవరావు, కరణ్, వెంకటేశ్, చెన్నయ్యయాదవ్, రమేశ్, సునీల్ పాల్గొన్నారు.
శంకర్పల్లి : మండల పరిధిలోని శేరిగూడలో సర్పంచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, ఉప సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజేందర్, నాయకులు ప్రవీణ్కుమార్, గోపాల్, రాఘవేందర్రెడ్డి, మద్ది ప్రశాంత్, శేఖర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.