మొయినాబాద్ : చేవెళ్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పీఈటీగా పని చేయడానికి బి.పీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి ముందుకు రావాలని పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా విద్యార్థులకు వైద్య సేవలు అందించడానికి హెల్త్ సూపర్వైజర్లుగా పని చేయడానికి ఏఎన్ఎం లేదా జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు దరాఖాస్తు చేసుకోవడానికి అర్హులని సూచించారు.
పీఈటీ, హెల్త్ సూపర్వైజర్లుగా పనిచేయడానికి అర్హులైన వారు తమ విద్యార్హత ధ్రువపత్రాలను తీసుకుని నేరుగా పాఠశాలకు రావాలని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 7995010635కు సంప్రదించాలని సూచించారు.