చేవెళ్ల రూరల్ : అంతర్జాతీయ అండర్-19 క్రికెట్ జట్టులో చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన ప్రేమ్కుమార్ చోటు దక్కించుకున్నాడు. ఇటీవల హర్యాన రాష్ట్రంలో జరిగిన జూనియర్ నేషనల్ డబుల్ వికెట్ క్రికెట్ చాంపియన్షిప్లో ప్రేమ్కుమార్ తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున ఆడి ప్రతిభ కనబర్చాడు. నవంబర్ 27వ తేదీ నుంచి నేపాల్లో జరుగబోయే అండర్-19 అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో ఆడే జట్టుకు ఈ యువకుడు ఎంపికయ్యాడు. దీంతో ప్రేమ్కుమార్ తల్లిదండ్రులు, స్నేహితులు అభినందించారు.
అభినందించిన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి
అంతర్జాతీయ క్రికెట్కు ఆలూరు వాసి ఎంపికవ్వడం పట్ల మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం ప్రేమ్కుమార్ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ మాట్లాడుతూ యువ క్రీడకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, యువత క్రీడల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రేమ్కుమార్కు తమ సహాయ సహకారాలు అందజేస్తామని వారు హామీ ఇచ్చారు.