ఆమనగల్లు, జూలై 7: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటారని జడ్పీటీసీ అనురాధ, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమనగ ల్లులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీ ఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆమనగ ల్లు పట్టణానికి పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని హర్షి స్తూ శుక్రవారం వారు విద్యార్థులతో కలిసి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జడ్పీటీసీ మాట్లాడుతూ ఈ కళాశాల ఏర్పాటుతో నాలుగు మండలాల విద్యార్థు ల కొన్నేండ్ల కల నెరవేరుతుందన్నారు. భవిష్యత్తులో ఆమనగల్లు మండలం విద్యాహబ్గా మారుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కుమా ర్, సర్పంచ్ లక్ష్మణ్నాయక్, ఏఎంసీ డైరెక్టర్లు సుభాష్, రమేశ్నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణ, అల్లాజీ, రాములు, వెంకట్రెడ్డి, భీమయ్య, సాయిలు, కిరణ్, వెంకటేశ్, రమేశ్, సుమ న్, యాదయ్య, గిరి తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుభాష్ హర్షించారు. శుక్రవారం ఆయన ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ నాలుగు మండలాల కూడలైన ఆమనగల్లులో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటైతే ఎంతోమంది విద్యార్థులకు మే లు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి సబితారెడ్డి, ఎమ్మె ల్యే జైపాల్యాదవ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో యువజన విభా గం జిల్లా నాయకుడు కిరణ్, టీఆర్ఎస్వీ నియోజవవర్గ ప్ర ధాన కార్యదర్శి సుమన్, శివకుమార్, లండం శివకుమార్, కల్యాణ్నాయక్ ఉన్నారు.