షాద్నగర్టౌన్, జనవరి 7: ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న ఆపరేటర్లకు సూచించారు. ఆదివారం దరఖాస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 28వార్డులకు సంబంధించి వచ్చిన ప్రజాపాలన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలన్నారు.
ఏదైనా సందేహం ఉంటే వెంటనే సంబంధిత అధికారిని అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఆన్లైన్ నమోదులో ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. అదే విధంగా మున్సిపాలిటీకి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు మొత్తం18355వచ్చాయని తెలిపారు.