బషీరాబాద్ : మండల పరిధిలోని దామర్చేడ్ గ్రామానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామునాయక్, గ్రామ పెద్దలు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అని, పేదింటి ఆడపడుచుల కల్యాణం సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం తరుపున కానుకగా అందిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి పేద కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీనివాస్రెడ్డి, హన్మంతు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.