సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) :రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసిన సీఎం కేసీఆర్.. సర్కారీ స్కూళ్ల అభివృద్ధిపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు స్కూళ్లను తలదన్నేలా కనీవిని ఎరుగని విధంగా అభివృద్ధి చేయబోతున్నారు. అందుకోసం ‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఆలియా హైస్కూల్, మహబూబియా స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.66 లక్షల నిధులు, రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి స్కూల్కు రూ.93 లక్షలు, జిల్లెలగూడ పాఠశాలకు రూ. 85 లక్షలు కేటాయించింది.
బడంగ్పేట, జనవరి20 : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లెలగూడ జడ్పీహెచ్ఎస్కు రూ. 62 లక్షలు, ఎంపీపీఎస్ స్కూల్కు రూ.23 లక్షలు కేటాయించారు. విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలోని పాఠశాల కావడంతో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఆమె ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పాఠశాలలో ఉన్న 900మంది విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తి అయినట్లు ప్రధానోపాధ్యాయురాలు నాగమణి తెలిపారు.
ఎంపీపీఎస్ స్కూల్లో అభివృద్ధి పనులు :
శిథిలావస్థలో ఉన్న మూడు తరగతి గదులను మరమ్మతులు చేయించారు.
విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం మోడల్ డైనింగ్ హాల్ నిర్మించారు.
కిటికీలు, తలుపులు మరమ్మతులు చేసి, ఫ్యాన్లు, ట్యూబ్లైట్స్ బిగించారు.
పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్ను సమకూరుస్తున్నారు.
పాఠశాలలో పాత బండలను తొలగించి కొత్త బండలు వేస్తున్నారు.
విద్యార్థులకు తాగునీటి కోసం సంపు నిర్మించారు.
ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం
మన ఊరు మన బడి పైలెట్ ప్రాజెక్ట్ పథకం కింద జిల్లెలగూడ జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్, రాజేందర్ నగర్లోని శివరాంపల్లి, మోడల్ హలియా, మహబూబియా పాఠశాలలను తీసుకున్నాం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దబోతున్నాం. విద్య కోసం ఎంత ఖర్చు అయినా చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న పాఠశాలల్లో పనులు చివరి దశకు వచ్చాయి. – విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
విద్యార్థులకు వరం
ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుని అబిడ్స్లోని ఆలియా ఉన్నత పాఠశాల, మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలల అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఇదో వరంలా మారనుంది. అన్ని స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంగా మార్చబోతున్నట్లు సీఎం కేసీఆర్, విద్యా మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రైవేటు స్కూల్ విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తీసుకునే అవకాశాలు మెరుగుపడుతాయి.
జిల్లెలగూడ జడ్పీహెచ్ఎస్లో అభివృద్ధి పనులు :