షాబాద్, జనవరి 2: విదేశాల నుంచి భారతదేశంలోకి వస్తున్న పత్తి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు గడిగే గజేందర్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని రైతువేదికలో సంఘ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై సుంకాన్ని తగ్గించడంతో వ్యాపారులు విరివిగా విదేశాల నుంచి పత్తి కొనుగోలు చేస్తూ, దేశీయ పత్తిని కొనడం లేదన్నారు. దీంతో పత్తి ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయని మండిపడ్డారు. సమా వేశంలో సత్యనారాయణరెడ్డి, రామస్వామిగౌడ్, పెంటయ్య, చంద్రబాబు, యాదయ్య, బాలయ్య, రైతులు మహేందర్రెడ్డి, రవి, శివ, రాంచంద్రయ్య, అంజయ్య, భూపాల్ తదితరులున్నారు.