ఇబ్రహీంపట్నం, జనవరి 1 : నూతన ఏడాదిని పురస్కరించుకుని సోమవారం నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఆయన నివాసంలో కలిసి కేక్కట్ చేయించారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గురునాథ్రెడ్డి, ఆరుట్ల సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్రావు, సీఐ గోవింద్రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : 2023సంవత్సరానికి బైబై చెబుతూ.. 2024 నూతన ఏడాదికి స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ వేడుకల ను పట్టణ ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భం గా సోమవారం పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజ లు చేశారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మున్సిపల్ చైర్మన్ నరేందర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
న్యూ ఇయర్ సంబురాలను పట్టణవాసులు ఆదివారం రాత్రి కేక్లను కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్సాహంగా సంబురాలను జరుపుకున్నారు. పట్టణం మొత్తం న్యూఇయర్ సందడే కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు పట్టణ ముఖ్యకూడలితో పాటు పలు రహదారుల వద్ద రాత్రి నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ రంగస్వామి, సీఐ ప్రతాప్లింగం పోలీసులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని ఎలికట్ట భవానీమాత ఆలయంలో భవానీ మాతకు భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అలాగే రామేశ్వరం, ఇతర ఆలయాలు భక్త సందోహంగా మారాయి.
చేవెళ్లటౌన్ : పట్టణంలోని పలు ఆలయాల్లో భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే క్రైస్తవ సోదరుల చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్ శైలజ, సొసైటీ చైర్మన్ వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ ఆగీరెడ్డి, శ్రీకాంత్, శ్రీపాద్, శ్రీనివాస్, వేదవ్యాస్, సృజన్, రామభద్రం తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట: నూతన ఏడాది సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. సోమవారం ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు తరలివెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలిత భువనేశ్వరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో భక్తు లు తెల్లవారుజామున శివలింగానికి అభిషేకాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా పలువురు నూతన సంవత్సర శుభాకాం క్షలు తెలుపుకున్నారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
యాచారం : మండలంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం నుంచే నూతన సంవత్సర సంబురాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, డీజే బాక్సుల సౌండ్తో నృత్యాలు చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, గతేడాదికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. మహిళలు ఇండ్ల ముందు రంగురంగులతో ముగ్గులు వేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఆమనగల్లు : నూతన సంవత్సర వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కేక్లు కట్ కేసి, మిఠాయిలు తినిపించుకుంటూ, ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు ఇంటి ముంగిట హ్యపీ న్యూ ఇయర్ 2024కు స్వాగతం అంటూ మహిళలు ముగ్గులు వేశారు. ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బలరాం కేక్ కట్ చేశారు.
కడ్తాల్ : మండల కేంద్రంతోపాటు గ్రామాలు, తండాల్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువకులు కేక్లు కట్ చేసి, పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. కాలనీలలో డీజే సౌండ్లు ఏర్పాటు చేసి యువకులు, చిన్నారులు డ్యాన్స్లు చేస్తు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం ఉదయం ఇండ్ల ముందు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మహిళలు, చిన్నారులు ముగ్గులు వేశారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిని ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు నర్సింహ, బిచ్చా నాయక్ తదితరులు ఉన్నారు. జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన మైసిగం డి మైసమ్మ దేవతను సోమవారం భక్తులు దర్శించుకున్నారు. భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో స్నేహలత, ట్రస్ట్ చైర్మన్ శిరోలీపంతూనాయక్ ఏర్పాట్లు చేశారు. అమ్మ వారిని దర్శించుకున్న వారిలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు ఉన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు మహిళలు, యువతులు ఇండ్ల ముందు అందమైన ముగ్గులు అలంకరించడంలో నిమగ్నమయ్యారు. వివిధ రకాల రంగులతో ముచ్చటైన ముగ్గులు వేసేందుకు పోటీ పడ్డారు. తమదైన శైలిలో ముగ్గులు వేసి ప్రతిభను చాటుకున్నారు.