తలకొండపల్లి : నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తగిన కృషి చేస్తానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి సీడీఎఫ్ నిదుల నుంచి రూ. 5లక్షల ప్రోసిడింగ్ను గ్రామ సర్పంచ్ రమేశ్ యాదవ్కు అందజేశారు. తమ గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్సీని అడగగానే నిధులు మంజూరు చేయడంతో సర్పంచ్తో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో అంతర్గత మురుగు కాలువలు, సీసీరోడ్డు, వీదిలైట్లతో పాటు అభివృద్ధి పనులకు తగినన్ని నిధులు ఇస్తానని అన్నారు. కార్యక్రంలో శ్రీనివాస్, శేఖర్, వెంకటేశ్ పాల్గొన్నారు.