షాబాద్, మే 2: షాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని శంకర్పల్లి ఎంపీపీ గోవర్దన్రెడ్డి అన్నారు. గురువారం శంకర్పల్లి మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : చేవెళ్ల ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపునకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా కృషి చేయాలని చేవెళ్ల మండల మాజీ ఎంపీపీ బాల్రాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ తెలిపారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
కారు గుర్తుకు ఓటు వేసి కాసానిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అమలు కాని హామీలను ఎండగడుతూ.. మరోసారి ప్రజలు మోసపోవద్దన్నారు. ఈ ప్రచారంలో చేవెళ్ల మండలం సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు శివారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణచారి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రాములు, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు నర్సింహులు, గిరిధర్ రెడ్డి, బి.నర్సింహులు, డైరెక్టర్లు వెంకటేశ్, మహేశ్, కృష్ణ, నాయకులు శేఖర్రెడ్డి, పెంటారెడ్డి, వెంకటేశ్, శేఖర్, సత్తి, ఎల్లయ్య ఉన్నారు.