షాద్నగర్, జనవరి 29 : బీఆర్ఎస్ అంటే ప్రజల పార్టీ అని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం తన నివాసంలో కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ తన పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. తెలంగాణ పాలన దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, వివిధ రాష్ర్టాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సామాన్య ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతుండటం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మనమందరం పనిచేస్తూ ఆయనకు అండగా నిలవాలన్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న రైతు బంధు, రైతు బీమా పథకాలతో నేడు రైతులు ధైర్యంగా ఉన్నారని, కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల అమలు ఆదర్శనీయమని అన్నారు. గత పాలనలో కనీస వైద్యానికి నోచుకోని ప్రజలు నేడు మెరుగైన వైద్యాన్ని పొందడంతో పాటు ఇంటి వద్దకే సర్కారు వైద్య సేవలు అందే స్థితికి వచ్చిందని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వస్తే షాద్నగర్ రైతుల తలరాతలే మారుతాయని అన్నారు. పార్టీలో చేరిన సుందరయ్య, జంగయ్య, ఆంజనేయులు, వినోద్, జనార్దన్, బాలరాజు, శ్రీశైలం, లక్ష్మయ్య, యాయద్య, నిరంజన్లతో పాటు పలువురికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్, పాపిరెడ్డిగూడ సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ, నర్సింహులు, నరేందర్, రమేశ్రెడ్డి, శంకర్ తదితలు పాల్గొన్నారు.