ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 26 : బీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు.
ఉదయం 10గంటలకు మన్నెగూడ సమీపంలోని వేద కన్వెన్షన్లో నిర్వహించే సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారన్నారు. పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.