షాద్నగర్, ఏప్రిల్ 21 : కాంగ్రెస్, బీజేపీ లను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్లు అన్నారు. ఆదివారం కేశంపేట మండల కేంద్రంలో నిర్వహించిన మండలస్థాయి సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఓ వైపు రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా… ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని, తాగునీరు దొరుకని పరిస్థితి నెలకొన్నదన్నారు.
రైతుబంధు, రైతు రుణమాఫీ, మహిళలకు రూ.2500 నగదు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఎక్కడ అమలవుతున్నాయని ప్రశ్నించారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రంలో పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పాలమూరు జిల్లాకు కనీస నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీని తరిమికొట్టాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను నిండాముంచేందుకు కుట్ర పన్నుతున్నాయని అన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొని, పదేండ్ల పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మరోమారు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, అప్పటి సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు వివరించాలన్నారు. కేశంపేట మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
పోమాలపల్లి గ్రామంలో భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో కేశంపేట ఎంపీపీ వై. రవీందర్యాదవ్, మాజీ ఎంపీపీ విశ్వనాథం, బీఆర్ఎస్ నాయకులు జగదీశ్వర్, రాంబల్నాయక్, వంకాయల నారాయణరెడ్డి, రాజ్యలక్ష్మి, పల్లె నర్సింగరావు, శేఖర్పంతులు, వెంకట్రెడ్డి, భూపాల్రెడ్డి, శ్రీశైలం, మల్లేశ్, నవీన్కుమార్, జమాల్ఖాన్, జనార్దన్రెడ్డి, అంజిరెడ్డి, మల్లేశ్యాదవ్, నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.