బీఆర్ఎస్తోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యపడుతుందని బీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల జనరల్ స్థానంలో బీసీ వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడమే ఇందుకు ఉదాహరణగా వారు చెబుతున్నారు. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీలోని నేతలు బీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆగమైన బీసీల పరిస్థితిని గుర్తు చేస్తున్నారు. ‘చేతనైతే బీసీ అభ్యర్థిని గెలిపించండి.. చూస్తాం..’ అంటున్న కాంగ్రెస్ నేతల అహంకారపూరితమైన మాటలతో ఇకనైనా బీసీలంతా మేల్కొనాల్సిన అవసరం ఉందని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసానికి పట్టం కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను నేతలు వివరిస్తున్నారు. బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావడమే కాకుండా.. ఊరూరా సమావేశాలు నిర్వహించి బీసీలను చైతన్యపర్చాలని కోరుతున్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతి బీసీ బిడ్డ ఓ సైనికుడై కృషి చేయాలని, కాసానిని గెలిపించుకుని చేవెళ్ల గడ్డ్డ.. బీసీల అడ్డా అని నిరూపించాలని బీసీ సంఘాలు పిలుపునిస్తున్నాయి.
– రంగారెడ్డి, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ):
బీసీల చైతన్యం చాటే సమయం ఆసన్నమైంది. జనాభలో 50 శాతం ఉన్న బీసీలు చెట్టుకొకరు పుట్టకోకరు కావడంతో ఐక్యత కొరవడింది. బీసీలు ఎవరికి వారు చీలిపోవడంతో రాజాధికారం దిశగా వెళ్లడం లేదు. చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గతంలో జడ్పీ చైర్మన్గా పనిచేశారు. దీంతో ఆయనకు జిల్లా మీద బాగా పట్టున్నది. బీసీ నాయకులను గెలుపించుకుంటే బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తారు. ఇప్పటికైనా చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని బీసీలు ఏకం కావాలి. బీసీ నేత కాసానికి ఓట్లు వేసి గెలుపించుకుందాం.
-శాపూరం రాంచంద్రయ్య, రెడ్డిపల్లి, మొయినాబాద్
చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. బీసీల హక్కు కోసం పోరాటం చేసే వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరమున్నది. 50 శాతం ఉన్న బీసీలం మన నాయకుడిని ఎందుకు గెలిపించుకోవద్దు. బీసీల్లో సంఘాల పేరుతో వీడిపోతున్నాం. వేర్వేరు సంఘాలుగా ఉన్నా రాజకీయంగా రాణించేందుకు అందరూ ఏకం కావాలి. ఇప్పటికైనా బీసీలు మేల్కోవాల్సిన రాజ్యాధికారం దిశగా కలిసికట్టుగా ముదుకెళ్లాలి. బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుతో బీసీల సత్తా చాటుదాం. బీసీ ప్రజాప్రతినిధులతోనే బీసీల సంక్షేమం, అభివృద్ధి సాధ్యం.
-కమ్మరి శ్రీనివాసచారి, సురంగల్, మొయినాబాద్
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు వెనుక బడిన కులాల అభివృద్ధికి మలుపు. బడుగు, బలహీన వర్గాల గొంతుకైన జ్ఞానేశ్వర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ టికెట్ ఇవ్వడం అభినందనీయం. అన్ని కులాల వారు పార్టీలకు అతీతంగా ఓట్లు వేసి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకోవాలి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ జంప్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డిని ఎవరు నమ్మరాదు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో ఎన్నో కష్టాలు, నష్టాలను చూస్తున్నాం. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకుంటే మన హక్కులను మనం సాధించుకోవచ్చు. ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేయాలి.
-రాజుగౌడ్, తాండూరు
96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి అందరిని ఒక్కతాటికి తీసుకువచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపుదాం. కేసీఆర్ బీసీలను గుర్తించి బీసీల ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్కు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి అవకాశం కల్పించడం చాల సంతోషంగా ఉన్నది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. బీసీల శక్తి , చైతన్యం అంటే ఎట్లుంటదో కాసానిని గెలిపించుకొని రుజువు చేద్దాం. అందుకోసం నియోజకవర్గంలోని బీసీలందరూ పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థికి మద్దతు తెలిపి గెలుపునకు కృషి చేయాలి.
-అనురాధ, తాండూరు
జనాభాలో బీసీల శాతం ఎక్కువగా ఉన్నా బీసీలకు సరైన న్యాయం జరుగడంలేదు. బీసీలకు రాజకీయాల్లో ఎదిగేందుకు ఇది మంచి అవకాశం. చేవెళ్ల గడ్డపై బీసీ అభ్యర్థిని భారీ మెజార్టీతో పట్టం కట్టి బీసీల బలం చూపాలి. ఎన్నో ఏండ్లుగా బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తూ తక్కువ శాతం ఉన్న వారు రాజ్యాధికారం చేపడుతున్నారు. చాలా రోజుల తరువాత బీసీ నాయకునిడి గెలిపించుకునే అవకాశం వచ్చింది. ఈ సారి బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఉండి బీసీ నాయకునిడి గెలిపించుకోవాలి. సమాజంలో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. బీసీల తరఫున మాట్లాడే నాయకులే కరువయ్యారు. ఈసారి ఎంపీ అభ్యర్థిగా జ్ఞానేశ్వర్ను గెలిపించుకొని బీసీల సత్తా చాటుదాం.
-శ్రీధర్గౌడ్, నాగారం, ధారూరు
బీసీల్లో మార్పు రావాలి..
బీసీల్లో ఐక్యత లేకుండా ఇతరులు కుట్రలు చేస్తున్నారు. అన్ని కులాల కంటే బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు. బీసీలు ఐక్యంగా ఉండి మన నాయకుడిని మనమే గెలిపించుకోవాలి. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తూ రాజకీయాల్లో రాణించకుండా కుట్రలు పన్నుతున్నారు. బీసీలను చులకనగా మాట్లాడిన వారికి తగిన గుణపాఠం చెప్పాలంటే బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో ఏండ్లుగా బీసీలు అణచివేతకు గురవుతూనే ఉన్నారు. రాజ్యాధికారం బీసీలకు రావాలంటే బీసీల్లో మార్పు రావాలి. కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని బీసీల ఐక్యతను చాటాలి.
-బ్రహ్మం , ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని బీసీలందరూ ఒకేతాటిపైకి రావాల్సిన సమయం ఇది. గత మూడు దశాబ్దాలుగా బీసీల ఐక్యత, రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్న బడుగుల గొంతుక కాసాని జ్ఞానేశ్వర్ను పార్లమెంటు పంపిద్దాం. బీసీ కులాల్లోని అందరూ కలిసికట్టుగా ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన సందర్భమిది. రాజకీయాలకతీతంగా బీసీ కులాల అభివృద్ధి, ఐక్యత కోసం కృషి చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ను ఎంపీగా గెలిపిద్దాం.
-ఎస్.మాసయ్య, ఉమ్మడి కులకచర్ల మండల బీసీ యువత అధ్యక్షుడు
పార్టీలకు అతీతంగా బీసీలమంతా ఏకతాటిపైకి వచ్చి కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ను గెలిపించుకుంటాం. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఎంతోకాలంగా కృషి చేస్తున్న కాసానిని గెలిపించుకుంటే బీసీల సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతారు. ప్రజలకు అమలుకాని హామీలను చెప్పి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఒడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే. బీసీలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టి బీసీల ఐక్యతను చాటాలి.
-రమేశ్ కురుమ, ఎన్టీఆర్నగర్వాసి
చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్కు భారీ మెజారిటీని అందించి బీసీల దమ్మేంటో చూపిస్తాం. చేవెళ్ల అడ్డ.. బీఆర్ఎస్ గడ్డ. గత రెండు సార్లు చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. జ్ఞానేశ్వర్ముదిరాజ్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికేట్ కేటాయించడం అభినందనీయం. బీసీలకు పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ పార్టీకు బీసీలమంతా రుణపడి ఉంటాం. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చారు. బీఆర్ఎస ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీ అభ్యర్థిని గెలిపించుకుందాం. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని జిమ్మికులు చేసినా జ్ఞానేశ్వర్ గెలుపును అపలేరు. బీసీలను కించపరుస్తూ మాట్లాడిన అగ్రవర్ణ నాయకుడికి తగిన బుద్ధి చెప్పాలంటే జ్ఞానేశ్వర్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది.
-బండారు మల్లేశ్ ముదిరాజ్, ఆర్కేపురం వాసి
ఏండ్ల తరబడి పాలించిన కాంగ్రెస్కు వెనుకబడిన వర్గాల సంక్షేమం ఏనాడు కనబడలేదు. నాటి నుంచి నేటి వరకు కేవలం వారిని ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడి వదిలేశారు. అత్యంత కీలకమైన చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని బీసీలకు ఇవ్వకపోగా. ఇచ్చిన పార్టీలను నిందించటం ఏమాత్రం సరికాదు. బీఆర్ఎస్ తొలి నుంచి బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నది. తాజాగా చేవెళ్ల స్థానం టికెట్ను బీసీ బిడ్డ కాసానికి ఇచ్చి మరోసారి పెద్దమనస్సును చాటుకున్నది. ఈ ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా నిలిచి కాంగ్రెస్కు గట్టి గుణపాఠం చెబుతాం.
-పోతుల రాజేందర్ పటేల్
ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన వర్గాల రాజ్యాధికారంతోనే సమాజంలో మార్పులు సాధ్యం. ఆ దిశగా కృషి చేసే రాజకీయ పార్టీలకు అండగా నిలువాలి. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల స్థానం టికెట్ను బీసీ వర్గానికి చెందిన కాసానికి ఇచ్చిన బీఆర్ఎస్ ఆ వర్గాలపై అభిమానాన్ని చాటుకున్నది. బీసీలంతా ఏకమైనా బీసీ అభ్యర్థిని గెలిపించుకోలేరని కాంగ్రెస్ నేత అహంకార పూరితంగా మాట్లాడటం సరికాదు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో బీసీలంతా కలిసికట్టుగా ముందుకెళ్లి కాసానిని అధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. ఏ పార్టీ బీసీలకు అనుకూలమో.. ఎవరు బీసీ పట్ల అహంకార పూరితంగా మాట్లాడుతున్నారో గుర్తించి గుణపాఠం చెప్పాలి.
-కృష్ణ ముదిరాజ్
రాజకీయాలకు అతీతంగా బీసీలంతా బీసీ అభ్యర్థికే ఓటు వేయాలి. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకు పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. బీసీల ఐక్యత అంటే ఏమిటో ఈ పార్లమెంటు ఎన్నికల్లో చాటుదాం. బీసీల ఓట్లు లేనిదే ఏ పార్టీకి మనుగడ ఉండదు. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
-బోనకుర్తి రాము, మైలార్దేవ్పల్లి
చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించేందుకు బీసీ సేన సంసిద్ధం కావాలి. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీ బిడ్డపై ఉన్నది. బీసీలను అవహేలన చేస్తున్న నేతలను ఓడించి తగిన బుద్ధి చెబుదాం.
-కోట పవన్కుమార్, మార్కండేయనగర్
చేవెళ్ల పార్లమెంటు స్థానం జనరల్గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించడం అభినందనీయం. బీసీలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానేశ్వర్ను గెలిపించాలి. బీసీలను చులకనగా చూస్తున్న రాజకీయ పార్టీలకు, నేతలను ఓడించి మన సత్తా చూపిద్దాం.
-దోమ శ్రీశైలం, ముదిరాజ్ యువత పరిగి పట్టణ అధ్యక్షుడు