సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చామకూర మల్లారెడ్డి పోటీ చేసి.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్పై 33,419 ఓట్ల మోజార్టీతో గెలుపొందగా, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీ చేసి.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతారావుపై 49,811ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
చామకూర మల్లారెడ్డి 2014లో ఎంపీగా, 2018 ఎమ్మెల్యేగా, 2023లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మర్రి రాజశేఖర్ రెడ్డి తొలిసారి శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.