షాబాద్, నవంబర్ 17: గతంలో 60ఏండ్లు పాలించి తెలంగాణకు ఏమీ చేయని నాయకులు, ఇప్పుడు ఏంజేస్తారని బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి మండలంలోని అంతారం, కేశారం, కక్కులూర్, సర్దార్నగర్, కుర్వగూడ, బోడంపహాడ్, మన్మర్రి, అప్పారెడ్డిగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారికి బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రామక్క పాటతో మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో నేడు తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంట్ కష్టాలు తప్పవని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.
కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి మాట్లాడుతూ…గ్రామాల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ వెంటనే ఉన్నారని చెప్పారు. ప్రచారాన్ని అడ్డుకునేందుకు కొంతమంది కావాలని లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు నర్సింగ్రావు, చల్లా శ్రీరాంరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, భానూరి జీవన్రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు దేశమళ్ల ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, డైరెక్టర్లు సూర్యప్రకాశ్, దేవేందర్రెడ్డి, పర్వేద నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నక్క శ్రీనివాస్గౌడ్, శేరిగూడెం వెంకటయ్య, మాజీ జడ్పీటీసీ జడల రాజేందర్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు మమతా, చల్లా సంధ్య, మునగపాటి స్వరూప, బండి యాదమ్మ, సంధ్యారాణి, కృష్ణారెడ్డి, పోలేపల్లి పూజిత, ఎంపీటీసీలు మంగళి కరుణాకర్, బంగ్రంపల్లి వనిత, గూడూరు సరళ, మధుకర్రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఏండీ చాంద్పాషా, పార్టీ నాయకులు నర్సింహులు, మల్లికార్జున్గౌడ్, శివప్రసాద్, రాంమ్మోహన్గుప్తా, రమేశ్యాదవ్, హరీశ్, ప్రదీప్, సురేశ్, సర్వేశ్, వెంకటేశ్, యాదిరెడ్డి, కారు చెన్నయ్య పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారాలను విస్తృతంగా చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గడపగడపకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. మున్సిపాలిటీలో 4వ వార్డుల్లో కౌన్సిలర్ శ్రీనివాస్గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండురంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల క్షేమం కోసం ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. షాద్నగర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బాలుయాదవ్, నాయకులు బాలాజీ, వెంకటేశ్, సంతోష్కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. విఠ్యాలలో వివిధ సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.
అభివృద్ధి చేసిన
నందిగామ : అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ, అంతిరెడ్డిగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు స్వామి, ఎంబడి రవి ఆధ్వర్యంలో సర్పంచ్ వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ కుమార్గౌడ్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో
శంకర్పల్లి : మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేసిన కాలె యాదయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని టవర్, లక్ష్మీకాలనీ, ఆదర్శ్నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేను యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్రెడ్డి, కౌన్సిలర్లు శ్వేత, సంతోష్, చంద్రమౌలి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, నాయకులు ప్రవీణ్కుమార్, వాసుదేవ్ కన్నా, పాండురంగారెడ్డి, యాదగిరి, చిన్న నర్సింహులు, విఠలయ్య, మహేందర్రెడ్డి, గోపాల్, రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు.