న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ : బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేసింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టిన రూ.400లకే వంట గ్యాస్ సిలిండర్ హామీతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పేద, మధ్య తరగతి ప్రజలు సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. పప్పు, ఉప్పుల నుంచి వంట నూనె, వంట గ్యాస్ వరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారీగా ధరలు పెంచి మోయలేని భారం మోపిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 15 సార్లు పెంచి అన్ని వర్గాల ప్రజలను కష్టాల్లోకి నెట్టేసింది. మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాడు కేవలం రూ.414లుగా ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.1100లకు పెంచింది. అదానీ, అంబానీలకే ప్రాధాన్యమిస్తూ దోచిపెడుతున్నది. ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలుసుకొని ఓట్ల కోసం వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. పేదల సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచించే సీఎం కేసీఆర్ వంట గ్యాస్ సిలిండర్ను అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.400లకు అందించాలని నిర్ణయించారు. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఊరికెళ్లినా మహిళలు, పేదలు ఘన స్వాగతం పలుకుతున్నారు.
సకల జనుల హితమే లక్ష్యంగా రూపొందిన బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన వరాల జల్లుపై అన్ని వర్గాల నుంచి ఆనందం వెల్లువెత్తుతున్నది. వంటగ్యాస్పై సబ్సిడీ వంటి ఆకర్షణీయ పథకాలపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగో లుగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలతో పేదలు కట్టెల పొయ్యిలపై వంటలు చేసుకునే పరిస్థితి రాగా.. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాతే రూ.400కే గ్యాస్ సిలిండర్ను సబ్సిడీపై మహిళలను పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు బండ బాదుడు ఉండదని పేర్కొంటున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలుమార్లు గ్యాస్ ధరలను పెంచడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పేదల కష్టాలు నేరుగా తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ రూ.400కే సిలిండర్ అందిస్తామని ఎన్నికల మ్యా నిఫెస్టోలో పెట్టడం సంతోషకరం. ప్రస్తుతం పెరిగిన గ్యాస్ ధరలతో ప్రజ లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బీఆర్ఎస్ కు ప్రజలంతా అండ గా నిలవడం ఖాయం.
సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాలకు అండగా ఉన్నారు. ఆయనతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం. హామీ ఇచ్చారంటే కచ్చితంగా నెరవేర్చుతారు. గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలతోపాటు మ్యానిఫెస్టోలో పెట్టని వాటి ని కూడా ఎన్నో అమలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్ను మహిళలకు పంపిణీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం సాగుతున్నది. పెరుగుతున్న వంటగ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర ధర లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. ఎన్నికల తర్వాత రూ. 400కే సిలిండర్ ఇస్తామని సీఎం కేసీఆర్ మ్యాని ఫెస్టోలో ప్రకటించడం హర్షనీయం. ప్రజ లందరి ఆశీస్సులతో భారీ మెజార్టీతో మూ డోసారి కూడా బీఆర్ఎస్ తప్ప కుండా అధికారంలోకి వస్తుంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అన్ని వస్తువుల రేట్లు అధికంగా పెరుగుతున్నాయి. ఇక గ్యాస్ సిలిండర్ ధర అయితే దాదాపుగా రూ.1100 చేరింది. దీం తో పేదలకు కట్టెల పొయ్యి దిక్కు అనుకుంటున్న సమయం లో సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్స్ పార్టీ మ్యానిఫెస్టోలో ఎన్నికల్లో గెలిచిన వెంటనే రూ.400కే సిలిండర్ను అందిస్తామని ప్రకటించడం ఆనందంగా ఉన్నది.
రోజురోజుకూ పెరుగుతున్న గ్యాస్ ధరలతో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేసుకోవాల్సి వస్తున్నది. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సిలిండర్ ధర ఎంతో పెరిగింది. దీంతో పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సీఎం కేసీఆర్ అర్హులైన పేద కుటుంబాల బాధలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబానికీ రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషకరం.
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పథకాలు చాలా బాగున్నాయి. అర్హులై మహిళల కోసం రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉన్నది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి మా జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ పేదల పాలిట నిజమైన దేవుడు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో ఎన్నికల హామీల దిశగా కాకుండా పేద బడు గు, బలహీనవర్గాల్లో ఆత్మస్థెర్త్యం పెంపొందించే దిశగా ఉన్నది.
సీఎం కేసీఆర్ మాటిస్తే తప్పకుండా నెరవేర్చుతారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను అడ్డగోలుగా పెంచుతూ సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. దీంతో చాలామంది మహిళలు కట్టెల పొయ్యిపైనే వంట చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పేద కుటుంబాల బాధలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబానికీ రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం చాలా సం తోషకరం. రానున్న ఎన్నికల్లో ఆయ న్నే మళ్లీ గెలిపించుకుంటాం.
సీఎం కేసీఆర్ గెలిచిన తర్వాత గ్యాస్ సిలిండర్ను రూ.400 కే అందిస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు రూ.1100 వరకు ఉన్న సిలిండర్ను కొనేందుకు పేదలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారు కట్టెల పొయ్యిలపైనే వంటలు చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ను రూ.400కే పంపిణీ చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల మీద మోయలేని భారం వేస్తున్నది. ఈ భారాన్ని తప్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే పేద మహిళలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ను అందిస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. అందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
గ్యాస్ సిలిండర్ రూ.400కే ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం అభినందనీయం. గ్యాస్ ఖర్చులు భరించలేకపోతున్నాం. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కోసం రూ. 1100 వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నది. సిలిండర్ను రూ.400కే అందిస్తే పేదలకు ఎంతో ఉపశమనం లభించినట్లే..
సీఎం కేసీఆర్ మాటపై నిలబడే వ్యక్తి.. ఇలాంటి వారు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. పేద, మధ్యతరగతి వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ఆయన రూపొందించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలను భారీగా పెంచుతున్నది. పెరిగిన ధరలతో ఇండ్లల్లో మహిళలు కట్టెల పొయ్యిలపై వంట వేసుకునే పరిస్థితి వచ్చింది. మహిళల ఇబ్బందులను గుర్తించిన సీఎం.. రానున్న ఎన్నికల్లో గెలిచిన వెంటనే గ్యాస్ సిలిండర్ను రూ.400లకే అందిస్తామని ప్రకటించడం చాలా సంతోషకరం. మహిళల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న సీఎంకే మా మద్దతు. మళ్లీ కారే గెలవాలి…సారే రావాలి…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల ను విపరీతంగా పెంచుతున్నది. సిలిండర్ పేరు చెబితేనే మహిళలు హడలిపోతున్నారు. దీంతో చాలామంది కట్టెల పొయ్యిలపైనే వంట చేసుకుంటున్నారు. మహిళల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల్లో గెలిచిన వెంటనే గ్యాస్ సిలిండర్ను రూ.400కే పంపిణీ చేస్తామని ప్రకటించడం అభినందనీయం.దీంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకం ఉన్నది. గతంలో ప్రకటించిన హామీలతోపాటు ఇతర వాటిని కూడా ఆయన అమలు చేశారు. గెలిచిన తర్వాత రూ.400లకే సిలిండర్ను పంపిణీ చేస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుంది.
రానున్న ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే సిలిండర్ ధరను రూ.400కే అందిస్తామని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టడం చాలా సంతోషకరం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలను విచ్చలవిడిగా పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి సిలిండర్ను రూ.400కే అందిస్తే పేదలకు ఎం తో మేలు జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యావత్తు తెలంగాణ హర్షిస్తున్నది.
సంక్షేమ పథకాల అమల్లో సీఎం కేసీఆర్కు ఎవరూ సాటిరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నది. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. సీఎం కేసీఆర్ మ్యానిపెస్టోలో ప్రకటించినట్లు గ్యాస్ ధరను రూ. 400లకు తగ్గిస్తే పేదలకు ఎంతో ఊరటగా ఉంటుంది.
సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుంది. మ్యానిఫెస్టోలోని అం శాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా ఉన్నాయి. కేంద్రం సిలిండర్ ధరను పెంచడంతో నిరుపేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు కష్టపడొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రూ.1100 గ్యాస్ సిలిండర్ను రూ.400కి అందిస్తామనడం అభినందనీయం. పేదలకు అండగా నిలబడుతున్న సీఎం కేసీఆర్కే మా మద్దతు.
సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు గెలిచిన తర్వాత సిలిండర్ను రూ. 400కే అందిస్తే గ్రామాల్లోని చాలా మంది పేదలు కట్టెల పొయ్యిని మానేసి.. గ్యాస్ సిలిండర్ను వినియోగిస్తారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యు న్నతికి కృషి చేస్తున్నారు. ఆయనతోనే అభివృద్ధి సాధ్యం.