ఆదిబట్ల, నవంబర్ 1 : కొంగరకలాన్ను మరో కోకాపేటగా అభివృద్ధి చేశామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.మంగళవారం రాత్రి ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల కాలంలో 20 ఏండ్ల అభివృద్ధి చేశానన్నారు. రూ. 2931 కోట్ల నిధులుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని వివరించారు. నియోజక వర్గంలో 23 విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు.
కొంగరకలాన్ గ్రామంలో ఫాక్స్కాన్ కంపెని ఏర్పాటుతో 35 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కల్వకోలు రవీందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కోరే కళమ్మ, కోఆప్షన్ సభ్యుడు పల్లె గోపాల్గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య, కౌన్సిలర్లు వనం శ్రీను, బీఆర్ఎస్ నాయకులు గోపగళ్ల బాబు, కాకి రవీందర్, దేవరపల్లి శ్రీనివాస్, కాకి మహేందర్, గోదాసు మధు, ముక్కెర నారాయణ పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : బీఆర్ఎస్ పార్టీతోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధి వైఎస్సార్ నగర్ కాలనీలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రూ.2931 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు. కార్యక్రమంలో విజయానంద్రెడ్డి, కొత్తకుర్మ శ్రీశైలం, బాబయ్య, మేతరి శంకర్, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందజేసి అందరిని ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ మాయ మాటలను నమ్మి మోసపోద్దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్నాయక్, నాయకులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : సీఎం కేసీఆర్ చల్లని దీవెనలతోనే గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీపీ కృపేశ్, సర్పంచ్లు బూడిద రాంరెడ్డి, బల్వంత్రెడ్డి, రవణమోని మల్లీశ్వరి అన్నారు. మండల పరిధిలోని ఉప్పరిగూడ, రాయపోల్, దండుమైలారంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ను గెలిపిస్తేనే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.
యాచారం : మంథన్గౌరెల్లి, మేడిపల్లి, నానక్నగర్, నజ్దిక్సింగారం, ధర్మన్నగూడ, అయ్యవారిగూడ, నల్లవెల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా మంచిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మంథన్గౌరెల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడిలో, అయ్యవారిగూడలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మండలి గోపాల్ ఆధ్వర్యంలో సోమన్న గుడిలో, నజ్దిక్సంగారంలో పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. మేడిపల్లిలో మండల ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాష ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు జిల్లా రాములు, యాదయ్యగౌడ్, రామచంద్రయ్య, వెంకటేశ్, విజయలక్ష్మి తదితరులున్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రచారం ఊపందుకున్నది. బూత్ల వారీగా బీఆర్ఎస్ నాయకులకు ఇన్చార్జి బాధ్యతలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కేటాయించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఒక్కో బూత్కు 20మంది చొప్పున బీఆర్ఎస్ కార్యకర్తలను కమిటీగా ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు మంద సుధాకర్, బర్ల మంగ, యాచారం సుజాత, నీలం శ్వేత, కసరమోని పద్మ, బర్తాకి జగన్, సుల్తాన్, మమత, మోహన్నాయక్, శంకరయ్య, కొండ్రు శ్రీలత, అల్వాల జ్యోతి, నరాల విశాలతో పాటు తదితరుల ఆధ్వర్యంలో ప్రచారాలు హోరెత్తిస్తున్నారు.
తుర్కయాంజాల్ : బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధి మునగనూర్లోని కాలనీ సంక్షేమ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎ కేసీఆర్ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, భవిష్యత్లో మరిన్ని సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు స్వాతి, సంగీత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యంరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి, నాయకులు జక్కా రాంరెడ్డి, మోహన్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఏ గ్రామంలో చూసిన సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు ముమ్మరంగా జరిగాయని, తన మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నదన్నారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి గెలుపునకు తనవంతు కృషి చేస్తాన్నారు. కార్యక్రమంలో జెర్కోని రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గానికి చెందిన పలువురు దివ్యాంగులు ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు చేసిన మేలుకు కృతజ్ఞతగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలని ముందుకొచ్చారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన మోటర్సైకిళ్ల ద్వారా నియోజకవర్గంలోని మొత్తం దివ్యాంగులను కలిసి బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రచారం చేయటానికి ముందుకొచ్చారు. బుధవారం సాయంత్రం దివ్యాంగులు తమ సొంత వాహనాలపైన ప్రచారాలకు సిద్ధ్దం కాగా.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి జెండా ఊపి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమంసంఘం అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ..దివ్యాంగులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తగిన గుర్తింపు లభించిందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..దివ్యాంగులు స్వచ్ఛదంగా ముందుకొచ్చి బీఆర్ఎస్ గెలుపుకోసం కదిలిరావటం ఎంతో సంతోషమన్నారు. కార్యక్రమంలో సత్తువెంకటరమనారెడ్డి, రమేష్రాజు, మహేశ్గౌడ్, యాదగిరి, భరత్కుమార్, రాజు, శివసాయి పాల్గొన్నారు.