కల్వకుర్తి, నవంబర్ 2: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభంజనం వీస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పద్మశ్రీనగర్ కాలనీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వందమంది యువకులు గురువారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరి మెడలో గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వారికి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందన్నారు. ఎన్నికల వరకు అలుపెరకుండా ముందుకు సాగాలని ఎమ్మెల్యే కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ప్రతిపక్ష పార్టీల కుయుక్తులకు తిప్పి కొట్టాలని సూచించారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృధ్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరించాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మున్సిపల్ కౌన్సిలర్ సూర్యప్రకాశ్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆమనగల్లు, నవంబర్ 2: పదేండ్లలో జరిగిన అభివృద్ధికి పట్టం కట్టాలని, బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించాలని మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆకుతోటపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్రావు ఆధ్వర్యంలో కల్వకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను , ఇటీవల సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ , బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి ఇతర రాష్ర్టాల సీఎంలు ఆదర్శంగా తీసుకొని, వారి రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు నిట్ట నారాయణ, ఎంపీటీసీలు నిట్ట మంగమ్మ, దోనాదుల కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గండికోట శంకర్, శ్రీనునాయక్, పరమేశ్, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు వెంకటపురం శివ, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు రంగయ్య, విజయ్, సాయిలు, కృష్ణ, వెంకటరమణ, యాదయ్య, బాలయ్య, బాలకృష్ణ, రమేశ్, శ్రీనివాస్రావు, వెంకటయ్య, జంగయ్య, వెంకటయ్య, మైస య్య, జంగయ్య, రాములు ఉన్నారు.
చారకొండ, నవంబర్ 2: బీఆర్ఎస్తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని చంద్రాయన్పల్లి ఎంపీటీసీ గోపిడి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గోకారం, చంద్రాయన్పల్లిలో కల్వకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్ మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మాడ్గుల, నవంబర్2: మండలంలోని గిరికొత్తపల్లి, అవురుపల్లి, నల్లవారిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, సర్పంచ్లు అదిమల్ల పద్మ శ్రీను, పార్వతమ్మ, జంగయ్య గౌడ్, ఎంపీటీసీ బండారు బ్రహ్మంగౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ కళ్లు రాజవర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గౌని లాలయ్య గౌడ్, పవన్రెడ్డి, జైపాల్నాయక్, నిరంజన్, హరికృష్ణ, దినేశ్, మహేందర్, శ్రీకాంత్, ఆకాశ్, రాములు, యాదయ్య, వెంకటయ్య, వసురాంనాయక్, పాల్గొన్నారు.