ఆమనగల్లు పట్టణంలో సోమవారం బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. బోనాల నేపథ్యంలో మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలతో బోనాలను అలంకరించారు. సాయంత్రం భాజా భజంత్రీలు, శివ సత్తుల శివాలు, యువకుల కేరింతల మధ్య బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
-ఆమనగల్లు, ఆగస్టు 28