రంగారెడ్డి జిల్లాలో చురుగ్గా సాగుతున్న ఓటర్ జాబితా ప్రక్షాళన
ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్ల తొలగింపు
తొలగించిన బోగస్ ఓట్లు 1,68,173
అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 43,660 ఓట్ల ఏరివేత
ఎల్బీనగర్లో 40,090 ఓట్ల తొలగింపు
జిల్లావ్యాప్తంగా 31.61లక్షల ఓటర్లు
మరో పది రోజుల్లో ప్రక్రియ పూర్తికి అధికారుల చర్యలు
పోలింగ్ కేంద్రాల వారీగా బూత్స్థాయి అధికారుల పర్యవేక్షణ
ఓటర్ జాబితాను మరింత ప్రక్షాళన చేసేందుకు రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా బోగస్ ఓట్లను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఒకరికి ఒకే ఓటు నిబంధనను పటిష్టంగా అమలు చేసేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో 1,68,173 బోగస్ ఓట్లను తొలగించారు. ఒకే ఓటర్ ఐడీ నంబర్పై డబుల్ ఫొటోలుండటం, వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటర్ గుర్తింపు కార్డులను గుర్తించి అధికారులు ఓటరు జాబితాల నుంచి తొలగిస్తున్నారు. ఒకే ఓటర్ ఐడీ నంబర్పై డబుల్ ఫొటోలున్న బోగస్ ఓట్లను తొలగించే ప్రక్రియ తుది దశకు చేరుకోగా.. ఒకే నియోజకవర్గంలో రెండు ఓటర్ గుర్తింపు కార్డు లు, వేర్వేరు నియోజకవర్గాల్లో ఉన్న కార్డుల ఏరివేత ప్రక్రియను రెండు, మూడు రోజుల్లో ప్రారంభించి పది రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా జిల్లాలో 31.61 లక్షల మంది ఓటర్లుండగా.. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 43,660 బోగస్ ఓట్లను అధికారులు ఏరివేశారు.
రంగారెడ్డి, జూలై 7, (నమస్తే తెలంగాణ): జిల్లాలో బోగస్ ఓటర్లకు చెక్ పెట్టేందుకు జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వారీగా బోగస్ ఓటర్లను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఒకే ఓటరు ఐడీ నంబర్పై డబుల్ ఫొటోలుండడం, ఒకే నియోజకవర్గంలో రెండు ఓటరు గుర్తింపు కార్డులు, వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరు గుర్తింపు కార్డులను గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారు. మొదటగా ఒకే ఓటరు ఐడీ నంబర్పై డబుల్ ఫొటోలున్న బోగస్ ఓటర్లను గుర్తించి తొలగించే ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. మరోవైపు ఒకే నియోజకవర్గంలో రెండు ఓటరు గుర్తింపులుండడం, వేర్వేరు నియోజకవర్గాల్లో ఉన్న ఓటరు గుర్తింపు కార్డుల ఏరివేసే ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో షురూ చేసి, మరో వారం, పది రోజుల్లో బోగస్ ఓటర్లను తొలగించే ప్రక్రియను పూర్తి చేసేందుకుగాను జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా 31.61లక్షల మంది ఓటర్లున్నారు.
ఇప్పటివరకు 1,68,173 బోగస్ ఓట్ల తొలగింపు..
జిల్లాలో బోగస్ ఓటర్ల తొలగింపు ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. ఇప్పటివరకు 1,68,173 బోగస్ ఓట్లను ఏరివేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్స్థాయి అధికారులు బోగస్ ఓటర్లను పరిశీలించి తొలగిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 43,660 బోగస్ ఓట్లు, ఎల్బీనగర్ నియోజకవర్గంలో 40,090, మహేశ్వరం నియోజకవర్గంలో 34,569, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 24,151, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 8898, చేవెళ్ల నియోజకవర్గంలో 7394, కల్వకుర్తి నియోజకవర్గంలో 5021, షాద్నగర్ నియోజకవర్గంలో 4290 బోగస్ ఓట్లను తొలగించారు.
జిల్లాలో 31,61,222 మంది ఓటర్లు..
జిల్లాలో మొత్తం 31,61,222 మంది ఓటర్లుండగా, పురుషులు-16,45,535 మంది ఓటర్లు, మహిళలు-15,14,536 మంది మహిళా ఓటర్లు, ఇతరులు-384 మంది, ఎన్ఆర్ఐలు 182 మంది, సర్వీస్ ఓటర్లు-585 మంది ఓటర్లు ఉన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం 2,88,914 మంది ఓటర్లుండగా పురుషులు-1,47,359 మంది, మహిళలు 1,41,475, ఇతరులు 80 మంది ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 5,57,142 మంది ఓటర్లుండగా పురుషులు-2,91,749 మంది, మహిళలు-2,65,229 మంది, ఇతరులు-164 ఓటర్లున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 4,89,111మంది ఓటర్లుండగా పురుషులు-2,52,412 మంది, మహిళలు-2,36,508 మంది, ఇతరులు-191 మంది ఓటర్లున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మొత్తం 5,02,974 మంది ఓటర్లుండగా పురుషులు-2,64,423 మంది, మహిళలు 2,38,347 మంది, ఇతరులు-204 మంది ఓటర్లున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొత్తం 6,64,205 మంది ఓటర్లుండగా పురుషులు-3,53,450 మంది, మహిళలు-3,10,524 మంది, ఇతరులు 231మంది ఓటర్లున్నారు.
చేవెళ్ల నియోజకవర్గంలో 2,37,629 మంది, పురుషులు-1,21,407 మంది, మహిళలు 1,16,143 మంది, ఇతరులు 79 మంది ఓటర్లున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 2,17,534 ఓటర్లుండగా, పురుషులు-1,11,291 మంది, మహిళలు-1,06,107 మంది, ఇతరులు 136 ఓటర్లున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో 2,03,713 మంది ఓటర్లుండగా, పురుషులు-1,03,444 మంది, మహిళలు-1,00,203 మంది, ఇతరులు-66 మంది ఓటర్లున్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 3307 పోలింగ్ కేంద్రాలుండగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 316, ఎల్బీనగర్ నియోజకవర్గంలో 545, మహేశ్వరంలో 511, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 535, శేరిలింగంపల్లిలో 590, చేవెళ్లలో 298, కల్వకుర్తి నియోజకవర్గంలో 262, షాద్నగర్ నియోజకవర్గంలో 250 పోలింగ్ కేంద్రాలున్నాయి.