ఇబ్రహీంపట్నం, మే 26 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఆదివారం బొడ్రాయి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామస్తులంతా ఉదయం నుంచే బొడ్రాయికి బోనాలు సమర్పించారు. వివిధ గ్రామాల నుంచి ఖానాపూర్ గ్రామానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావటంతో గ్రామంలో సందడి నెలకొంది.
కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ మహిపాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గురునాథ్రెడ్డి, కౌన్సిలర్ శంకరయ్య, ఉప్పరిగూడ సహకార సంఘం అధ్యక్షుడు పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాచారం : ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండలంలోని గున్గల్ గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ, గంగాదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దమ్మ తల్లి, గంగాదేవి ఆలయాల్లో ఆయన పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురాతన ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సతయ్య, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ, మాజీ సర్పంచ్ సురేందర్రెడ్డి, నాయకులు మచ్చ లక్ష్మణ్, గిరమోని భిక్షపతి తదితరులున్నారు.